ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనుకుంట…కానీ ఆహా ఏమని క్లారిటీ ఇచ్చింది అంటే.?

ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అనుకుంట…కానీ ఆహా ఏమని క్లారిటీ ఇచ్చింది అంటే.?

by Sainath Gopi

Ads

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్స్ ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్నా ఈ టాక్ షో మూడవ సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఈ టాక్ షో కి సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు వచ్చి హడావిడి చేసిన సందర్భాలు ఉన్నాయి.

Video Advertisement

ఈ టాక్ షోలో ముందు జరిగిన రెండు సీజన్స్ ను సీజన్ 1, సీజన్ టు అని పిలువగా ముచ్చటగా వచ్చే మూడవ సీజన్ ని మాత్రం లిమిటెడ్ ఎడిషన్ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ కొత్త సీజన్ సరికొత్త ఎపిసోడ్లు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ హాజరయ్యే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చాలామంది అది నిజమని నమ్మారు కూడా. మన మిమర్స్ అయితే ఈ విషయం పై చాలా ఎక్సయిట్ అవ్వడమే కాకుండా తమకు తోచిన మిమ్స్ కూడా చేశారు.

బాలకృష్ణ ,చిరంజీవి కలిసి ఎపిసోడ్ చేస్తున్నారు అంటే ఆ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో ఫాన్స్ ఎగ్జాయిటింగ్ గా ఎదురు చూశారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో కలిసి బాలయ్య చేసిన ఎపిసోడ్ కంటే కూడా ఇది పవర్ ప్యాకెట్ గా ఉంటుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే చివరికి మెగాస్టార్ ఈ ఎపిసోడ్ కి రావడం లేదు అని ఆహా టీం స్పష్టం చేసింది. దసరా కంటే ముందే వచ్చే మొదటి ఎపిసోడ్ లో బాలయ్య తో పాటు భగవంత్ కేసరి టీం వచ్చే అవకాశం ఉందని చూచాయిగా ఆహా టీం హింట్ ఇచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి,కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్…వీళ్ళు అందరూ లేక వీరిలో కొందరు అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో కనిపించే అవకాశం ఉంది.


End of Article

You may also like