తల్లిగా బాధగా ఉంది..దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.! నీ పాదాలకు వందనం తల్లి!

తల్లిగా బాధగా ఉంది..దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.! నీ పాదాలకు వందనం తల్లి!

by Megha Varna

Ads

తాజాగా భారత్ కు చైనా ల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.అయితే లడఖ్ లోని గాల్వాన్ లోయలో భారత్ ,చైనా సైనికులు మధ్య కాల్పులు జరిగాయి.కాగా భారత్ కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించారు.అయితే ఆ మరణించిన వారిలో కర్నూల్ కి చెందిన సంతోష్ బాబు కూడా ఉన్నారు.అయితే సంతోష్ బాబు మరణ వార్త విన్న ఆమె తల్లి స్పందిస్తూ ..నా కొడుకు చనిపోయాడు అని ఓ పక్క బాధగా ఉన్నా… దేశం కోసం చనిపోయాడు అని ఆనందంగా కూడా ఉంది అని అన్నారు..కాగా ఆ జవాన్ తల్లి మాటలు విన్న నెటిజన్లు మీకు వందనాలమ్మా…దేశంకోసం కొడుకునే త్యాగం చేసారు అంటూ కామెంట్స్  కామెంట్స్..వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

సంతోష్ బాబు తల్లి మాట్లాడుతూ ..నా కొడుకు 15 సంవత్సరాలలోనే ఆర్మీ లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఎన్నో ప్రొమోషన్స్ కూడా తెచ్చుకున్నాడు అని అన్నారు.కానీ చైనా భారత్ సరిహద్దులో పరిస్థితి సీరియస్ గానే ఉంది అని నా కొడుకు నాకు ముందే చెప్పాడు అని సంతోష్ బాబు తల్లి అన్నారు.కొడుకు చనిపోయినందుకు బాధగా ఉన్న దేశం కోసం చనిపోయినందుకు ఆనందంగా ఉంది అని సంతోష్ కుమార్ తల్లి అన్నారు.సంతోష్ కుమార్ భార్య పేరు సంతోషి.సంతోష్ కుమార్ కు అభిజ్ఞ అనే 9 యేళ్ళ కూతురు మరియు అనిరుద్ అనే 4 యేళ్ళ కుమారుడు ఉన్నారు.ఇప్పటికే ఆర్మీ ఆఫీషియల్స్ అందరూ సంతోష్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అయితే కర్నూల్ కి చెందిన సంతోష్ బాబు గత సవంత్సరం నుండి భారత్ ,చైనా సరిహద్దులో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే సంతోష్ బాబు కు 3 నెలల క్రితం హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది.దీంతో హైదరాబాద్ వచ్చి కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిద్దాం అని అనుకున్నారు సంతోష్ బాబు.కాగా సంతోష్ కుమార్ కుటుంబ సభ్యులు కు ఎంతో ఆశతో సంతోష్ బాబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చేస్తారా అంటూ ఎదురు చూడసాగారు.కానీ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ ట్రాన్ఫర్ అవ్వడం ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ అంతలో అనుకోకుండా సంతోష్ బాబు మృతి చెందారు.దీంతో సంతోష్ బాబు కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


End of Article

You may also like