Ads
సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఒక రకమైన క్రేజ్ ఉండడం సహజమే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఏం చేసినా కూడా వార్తల్లో నిలుస్తుంది. అందుకే వాళ్లని సెలబ్రిటీలు అంటారు. అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత ఒక రకమైన బాధ్యత కూడా ఉంటుంది.
Video Advertisement
వాళ్లు ఏం చేసినా ఫోకస్ అవుతుంది కాబట్టి బయట ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అది కూడా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది జనాలు ఉన్నప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది కూడా తెలిసి ఉండాలి. కానీ సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులే కాబట్టి వారు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఇలా బయటికి వస్తూ ఉంటాయి.
వివరాల్లోకి వెళితే, సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సమ్మోహనం, వి సినిమాల తర్వాత సుధీర్ బాబు, మోహన్ కృష్ణ కలిసి చేస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ట్రైలర్ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఒక డాక్టర్ హీరోయిన్ అయితే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చూపించారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ, అడవి శేష్, నాగ చైతన్య, హరీష్ శంకర్ అతిథులుగా వచ్చారు. అలాగే వీరితో పాటు సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన సుధీర్ బాబు, కృతి శెట్టితో పాటు సినిమా బృందం అంతా కూడా ఈవెంట్ కి వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు కామెంట్స్ కి దారి తీసింది. అదేంటంటే, సుధీర్ బాబు ఈవెంట్ మధ్యలో మాట్లాడుతూ ఇటీవల మరణించిన కృష్ణం రాజు గారి గురించి చెప్తున్నారు.
వెనకాల డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ తప్ప ఎవరూ వింటున్నట్టు కనిపించలేదు. అడివి శేష్, కృతి శెట్టి వెనకాల ఏదో మాట్లాడుకుంటున్నారు. మధ్యమధ్యలో నవ్వుతున్నారు. వాళ్ళు అసలు సుధీర్ బాబు చెప్పేది వినట్లేదు అని అది చూస్తే అర్థమవుతుంది. వీళ్లు మాత్రమే కాకుండా వెనకాల ఇంకెవరో కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. సుధీర్ బాబు, “కృష్ణం రాజు గారి పేరు నిలబెట్టాలి అంటే అంత మంచి సినిమాలు చేయాలి. అది కేవలం ప్రభాస్ బాధ్యత మాత్రమే కాదు. తెలుగు హీరోల బాధ్యత” అని చెప్తున్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు.
వెనకాల నుంచున్న కృతి శెట్టి కేవలం వాళ్ళ చప్పట్లు కొట్టారు అని తాను కూడా చప్పట్లు కొట్టారు. అసలు సుధీర్ బాబు ఏం చెప్పారు అనే విషయం కూడా తెలుసుకోలేదు. “ఒకవేళ వాళ్ళు ఫ్రేమ్ లో లేకపోతే ఇలా ఏమైనా చేసినా అనుకోవచ్చు కానీ, ఫోకస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తే ఎలా?” అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. “అసలు అంత సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు వినాలి కదా? లేదా కనీసం మాట్లాడకుండా నుంచోవాలి కదా?” అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
Venkala enti
Adivisesh krithi papa tho pulihora mixing 😂😂#KrithiShetty @AdiviSesh #AaAmmayiGurinchiMeekuCheppali https://t.co/1nBtAOIRig
— Surya Sayz 🦋 (@SuryaSayz_) September 13, 2022
End of Article