బిగ్ బాస్ కంటెస్టెంట్ల క్వారెంటైన్ సెంటర్ లో కరోనా కలకలం? ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్?

బిగ్ బాస్ కంటెస్టెంట్ల క్వారెంటైన్ సెంటర్ లో కరోనా కలకలం? ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్?

by Mohana Priya

Ads

తెలుగు బిగ్ బాస్ షో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున పై చిత్రీకరించిన బిగ్ బాస్ ప్రోమో విడుదల అయ్యి జనాలలో ఆసక్తిని ఇంకా పెంచింది. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూనే బిగ్ బాస్ కోసం సెట్ రూపొందించారు. అంతేకాకుండా ప్రోమో షూటింగ్ వంటి మిగిలిన ఏర్పాట్లు కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే చేస్తున్నారట.

Video Advertisement

సోషల్ మీడియాలో కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒకరిగా రోజుకు ఒక సెలబ్రిటీ పేరు ప్రచారమవుతోంది. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం బిగ్ బాస్ కంటెస్టెంట్ ల జాబితాలో కొరియోగ్రాఫర్ రఘు, అతని భార్య సింగర్ ప్రణవి, మంగ్లీ, నోయల్, కరాటే కళ్యాణి, యాంకర్ లాస్య, దేవి నాగవల్లి, అలేఖ్య హారిక పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ లని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో క్వారంటైన్ లో ఉంచారు అని సమాచారం. ఆ కంటెస్టెంట్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అందులో ఒకరు గాయకులు, ఇంకొకరు యాక్టర్ అని సమాచారం. కానీ బిగ్ బాస్ యాజమాన్యం షో మొదలయ్యే ముందు వరకూ వేచి చూసి అప్పటికి కూడా రిపోర్ట్ పాజిటివ్ ఉంటే వీళ్ళ స్థానంలో ఇంకొకరిని తీసుకుంటారట.

అంతేకాకుండా బిగ్ బాస్ మొదలయ్యే తేదీ కూడా ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 6 వ తేదీకి మారింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే మా టీవీ యాజమాన్యం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి.


End of Article

You may also like