కియారా ఫోటోపై ట్రోల్ల్స్ రావడంతో…ఆ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్ట్ ఇది..! 2002 నాటి ఫోటో అంట?

కియారా ఫోటోపై ట్రోల్ల్స్ రావడంతో…ఆ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్ట్ ఇది..! 2002 నాటి ఫోటో అంట?

by Sainath Gopi

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచమైన హీరోయిన్ కియారా అద్వానీ. బాలీవుడ్ నుంచి తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో టాలీవుడ్ ప్రేక్షకలోకాన్ని బుట్టలో వేసుకుంది. “భరత్ అనే నేను” తో పాపులర్ అయిన బాలీవుడ్ స్మార్ట్  బ్యూటీ తరువాత వినయ విధేయ రామ తో మెరిసింది కానీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.ఆ సినిమా ప్లాప్ అవ్వడం తో మళ్ళి టాలీవుడ్ లో ఇంత వరకు కనిపించలేదు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా…సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా నే ఉంటుంది కైరా అద్వానీ. తన అందచెందాలతో ఫోటోలు పెడుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా పెట్టిన ఓ ఫోటో మాత్రం ట్రోల్ కి గురవుతుంది. అంటే అందులో వేసుకున్న డ్రెస్ వింతగా ఉంది. నిజం చెప్పాలంటే డ్రెస్ వేసుకోలేదు అనుకోండి. ఏదో ఆకుతో కవర్ చేసుకుంది. ఇక మన తెలుగు పేజెస్ గురించి తెలిసిందేగా.ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు.

అయితే ఇప్పుడు ఈ ఫోటో వెనకున్న ఓ సీక్రెట్ బయటపడింది. ఆ ఫోటోషూట్ కి సంబందించిన మరో పిక్ బయటకు వచ్చింది. అందులో కియారా దుస్తులు ధరించి ఉంది. దీంతో ఆ ఫోటోను ఎడిటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది.దీంతో కొంతమంది నెటిజెన్స్ ఇలా అడ్డుపెట్టి భ్రమ కలిగించి.. పిచ్చివాళ్లను చేద్దామని అనుకుంటున్నారా? అంటూ ఫోటోగ్రాఫర్ డబూ రతానీపై ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ గా గడిపేస్తూ ఉంది ఈ బ్యూటీ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో ప్రీతి పాత్రతో బాలీవుడ్ ని ఆకట్టుకుంది. కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది ఈ అందాల తార. పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించబోతుంది అనే వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. లేటెస్ట్ సమాచారం మేరకు మహేష్‌తో తెలుగులో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇలా ట్రోల్ల్స్ రావడంతో ఆ ఫోటోగ్రాఫర్ రత్నాని…ఒక ఆసక్తికర విషయం బయటపెట్టాడు. టబు ఆకు వెనకాల దాగున్న ఫోటోని గుర్తుచేసుకున్నాడు. 2002 లో అతను తీసిన ఫోటో అది. నా కాన్సెప్ట్ నేనే రిపీట్ చేశాను అని పోస్ట్ చేసారు. కానీ ఇలా ట్రోల్ల్స్ వస్తాయి అనుకోలేదు అన్నారు.


You may also like