సీరియల్ నటి “శ్రావణి” కేసులో ట్విస్ట్…బయటపడ్డ సంచలన విషయాలు..!

సీరియల్ నటి “శ్రావణి” కేసులో ట్విస్ట్…బయటపడ్డ సంచలన విషయాలు..!

by Mohana Priya

తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. మౌన రాగం, మనసు మమత సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్‌లో నివాసముంటున్నారామె.

Video Advertisement

రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంట‌నే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. .. కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయమయ్యారు. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను.

ఆ పరిచయం స్నేహంగా మారింది. అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు. శ్రావణి తను చనిపోయే ముందు దేవరాజ్ తనని వేధిస్తున్నట్లు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే అతని వేధింపులు ఆగకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

ashok reddy

శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి, అలాగే ఆర్ ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పేర్లు కూడా బయటికి వచ్చాయి. సమయం కథనం ప్రకారం శ్రావణి సాయి తో ప్రేమలో ఉన్నారు అని, తర్వాత దేవరాజ్ ని ఇష్ట పడడం తో సాయి శ్రావణి పై కోపం పెంచుకున్నాడు అని, అంతేకాకుండా ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి తో సహజీవనం కోసం సాయి శ్రావణి ని వేధించాడని, దేవరాజ్ అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని ఇంకా ప్లాన్ వేశాడు అని దేవరాజ్ ఆరోపించారట.

దీనిపై దేవరాజ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 7 వ తేదీన తను శ్రావణి కలిసి ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు సాయి చూసి అక్కడికి వచ్చి దేవరాజ్ పై దాడి చేసి, శ్రావణి పై చేయి చేసుకున్నాడని చెప్పారు. పోలీసులు ఆ హోటల్ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తే దేవరాజ్ చెప్పినట్టుగానే సాయి తనపై దాడి చేసి, శ్రావణి పై చేయి చేసుకున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

దీనిపై సాయి స్పందిస్తూ శ్రావణి చనిపోవడానికి కారణం దేవరాజ్ అని, ప్రేమ పేరుతో శ్రావణి మోసం చేశాడు అని, దేవరాజ్ పని అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేయడం అని, దేవరాజ్ వేరే అమ్మాయిలతో మాట్లాడిన ఆడియోలను, అలాగే అమ్మాయిలతో ఉన్న వీడియోలను స్వయంగా శ్రావణి తనకి ఇచ్చిందని, దేవరాజ్ ఈ కేసు నుండి బయటపడడానికి నిర్మాత అశోక్ రెడ్డి ని ఇరికించాడని,

దేవరాజ్ వేధిస్తుంటే వార్నింగ్ కూడా ఇచ్చాను అని, ఒక వేళ తను శ్రావణి ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడో చేసుకునే వాడిని అని, తన తల్లిదండ్రులకి కూడా ఈ పెళ్లి ఇష్టమే అని, అంతే కాకుండా తను పోలీసుల విచారణకి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు సాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది.

 

 


You may also like