“మన్మధుడు” క్లైమాక్స్ లో ఈ సీన్ గుర్తుందా.? అసలు అప్పుడు ఏమైందంటే.?

“మన్మధుడు” క్లైమాక్స్ లో ఈ సీన్ గుర్తుందా.? అసలు అప్పుడు ఏమైందంటే.?

by Mounika Singaluri

Ads

నాగార్జున హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాకి ఇప్పటికి కూడా క్రేజ్ ఉంది అంటే అందుకు కారణం సినిమాలో ఉన్న కథ, పాటలు, కామెడీ, డైలాగ్స్. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన డైలాగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో, దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కూడా అంతే ఆదరణ పొందాయి. ఇంక లవంగం పాత్రలో బ్రహ్మానందం కామెడీ అయితే ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Video Advertisement

ఈ సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన అన్షు కూడా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే చాలా వరకూ సినిమాల్లో చూపించేది నిజం కాదు. అంతేకాకుండా కొన్నిసార్లు తెర మీద ఒకటి ఉంటే తెర వెనకాల మరొకటి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెరమీద చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది తెరవెనుక పరిస్థితి. మన్మధుడు సినిమా విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది.

మన్మధుడు సినిమా క్లైమాక్స్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ సోనాలి బింద్రే తన పెళ్లి అని హీరోకి కార్డు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో తన ప్రేమని హీరోయిన్ కి చెప్పాలి అని హీరోయిన్ కోసం బయలుదేరుతాడు.

తర్వాత హీరోయిన్ పడవలో వెళ్లడం చూసి తనకోసం నీళ్ళల్లో దూకి ఈదడానికి ప్రయత్నిస్తాడు. హీరో నాగార్జునకి ఈత రాదు అని సినిమాలో ముందే చెప్పారు. కాబట్టి అదే విషయం గుర్తుకు వచ్చిన హీరోయిన్ హీరో కోసం నీళ్లలో దూకి వెళ్లి హీరోకి సహాయం చేస్తుంది. తర్వాత హ్యాపీ ఎండింగ్.

ఇదంతా మనం తెర మీద చూసింది. కానీ నిజానికి షూటింగ్ సమయంలో ఆ సీన్ చేసేటప్పుడు భయపడింది సోనాలి బింద్రే అట. భయం తో ఈత కొట్టడానికి సోనాలి బింద్రే ఇబ్బంది పడుతూ ఉంటే నాగార్జున సహాయం చేశారట. చూశారా? సినిమా తో పోలిస్తే నిజానికి జరిగిన సంఘటన ఎంత భిన్నంగా ఉందో?


End of Article

You may also like