అప్పుడు అనుపమ…ఇప్పుడు దిశా..! ఇలా అయితే మా సింగిల్స్ ఏమైపోవాలి బుమ్రా?

అప్పుడు అనుపమ…ఇప్పుడు దిశా..! ఇలా అయితే మా సింగిల్స్ ఏమైపోవాలి బుమ్రా?

by Megha Varna

కెట‌ర్ బుమ్రా, హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఏమి జ‌రుగుతోంది? వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారా? సోష‌ల్ మీడియాలో కొన్ని రోజుల కిందట ఇదే ట్రేండింగ్ టాపిక్. సోషల్ మీడియాలో బుమ్రా ఫాలో అయ్యే సెలబ్రిటీ అనుపమ ఒక్కరే అంట. అంతేకాదు ఒక‌రు పెట్టే పోస్ట్‌కు మ‌రొక‌రు వెంట‌నే లైక్‌లు కొట్ట‌డం, ఒక‌రి పోస్ట్‌ల‌ను మ‌రొక‌రు షేర్ చేయ‌డం త‌ర‌చుగా చేస్తున్నార‌ట‌. దీంతో వారు కలిసి బయట కనిపించక పోయిన వారిద్దరి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ సీన్ లోకి దిశా పటాని కూడా ఎంటర్ అయిపొయింది.

Video Advertisement

న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో 5-0తో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు. చివరి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇందులో ఒకటి మెయిడిన్ ఉండటం విశేషం. ఇప్పుడు ఈ విషయంపై దిశా పటాని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించింది.

తన అప్‌కమింగ్ మూవీ ‘మలంగ్’ప్రమోషన్స్‌లో భాగంగా చివరి టీ20కు ముందు దిశా పటాని. అధికారిక బ్రాడ్‌కాస్టర్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గొంది. మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ను పిక్ చేయమంటే నేను బుమ్రా పేరే చెబుతా. అతనో అద్భుతమైన ఆటగాడు. కివీస్‌ను బుమ్రా కట్టడి చేయడం, భారత్ గెలవడం గర్వించదగిన విషయం.’అని ఈ బాలీవుడ్ భామ పేర్కొంది.


You may also like