Ads
మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని మహి వీ రాఘవ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో వైఎస్సార్గా నటించిన మమ్ముట్టి నటనకు తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తాజాగా యాత్ర 2 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
Video Advertisement
ఈ మూవీలో జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహంలో జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించారు. అయితే జగన్ గా నటించిన ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
‘యాత్ర 2’ సినిమా నుంచి తాజాగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్ ల క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిగా మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.జగన్ గా కోలీవుడ్ హీరో జీవా నటించనున్నారు. ఈ పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఇద్దరు ఇన్టెన్స్ లుక్స్తో కనిపిస్తున్నారు.
మరో వైపు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఏం వైఎస్ జగన్ లైఫ్ లో జరిగిన పలు సంఘటనల ఆధారంగా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి వ్యూహం అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్ ను ప్రకటించాడు. ఈ సీక్వెల్కు శపథం అనే పేరు ఖరారు చేస్తూ, ఒకే పోస్టర్ లో వ్యూహం, శపథం చిత్రాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. ఈ సినిమాలలో జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో అజ్మల్ నటిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, ఈ రెండు సినిమాలలో జగన్ పాత్రలలో నటిస్తున్న ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు ఒక మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా పేరు రంగం. ఈ సినిమాకి కె. వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. కార్తీక నాయర్ హీరోయిన్ గా నటించింది. జీవా, అజ్మల్ ఇద్దరు ఫ్రెండ్స్ గా నటించారు.
Also Read: “ఉపాసన కొణిదల” ఆహార నియమాలు ఇంత కఠినంగా ఉంటాయా..? ఒక రోజులో ఏం తింటారంటే..?
End of Article