మళ్లీ వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేస్.! పలువురు సినీ ప్రముఖులకి ఈడీ నోటీసులు.!

మళ్లీ వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేస్.! పలువురు సినీ ప్రముఖులకి ఈడీ నోటీసులు.!

by Mohana Priya

Ads

నాలుగేళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలైన డ్రగ్స్ వివాదం మళ్లీ బయటికి వచ్చింది. ఈ విషయంలో ఈడీ పలువురు ప్రముఖ సినీ సెలబ్రిటీలకి నోటీసులు జారీ చేసింది. వారిలో రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, ఛార్మి, నవదీప్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్, రానా దగ్గుబాటి, పూరి జగన్నాథ్ ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ విషయంపై చాలా చర్చలు జరిగాయి.

Video Advertisement

ed notice to celebrities

కొంత మంది సినీ ప్రముఖులని ఈ విషయంపై నార్కోటిక్స్ విభాగం వాళ్ళు ఆఫీస్ కి పిలిచి విచారించడం అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తం 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 22 వరకు ఈ విచారణ జరుగుతుంది అని సమాచారం.


End of Article

You may also like