హాస్యంతో క‌రోనిపై జ‌నాల‌లో అవ‌గాహ‌న క‌లిపించేందుకు ఈ బృందం పాడిన పాట వినండి.

హాస్యంతో క‌రోనిపై జ‌నాల‌లో అవ‌గాహ‌న క‌లిపించేందుకు ఈ బృందం పాడిన పాట వినండి.

by Megha Varna

Ads

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ గడువును కేంద్రం మరో రెండు వారాలు పెంచింది. కరోనా నివారణ కోసం వైద్యులు, పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.కరోనా సమస్య పై ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి కొందరు ప‌లువురు ప్ర‌ముఖులతో పాటు సామాన్య ప్రజలువినూత్న మార్గాల‌ని ఎంచుకుంటున్నారు.వీడియోల ద్వారా తమ సందేశాలు పంపుతున్నారు , యూట్యూబ్ లో కరోనా మీద వచ్చిన పాటలు అన్ని అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుత తరుణంలో ఇంటికే పరిమితమవుతున్న లక్షలాది మంది ప్రజలకు కాలక్షేపం కల్పించేందుకు, హాస్యంతో వారి భయాందోళనలకు కాసేపైనా దూరం చేసేందుకు సోషల్‌ మీడియా కళాకారులు తమదైన శైలిలో కృషి చేస్తున్నారు.

Video Advertisement

ఇండస్ట్రీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్స్ తమదైన స్టైల్ లో పాటలు పడుతూ అవగాహనా కల్పిస్తున్నారు.  ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు కరోనా ఓ పాటను విడుదల చేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది మహమ్మారి రోగ మొక్కటి పేరడి పాట ప్రస్తుతం ఈ పాట నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంది.కరోనాపై చిరు, నాగ్‌, తేజూ, వరుణ్ తేజ్ కలిసి కోటి సారథ్యంలో పాట ఆలపించగా, వందేమాతరం శ్రీనివాస్ కూడా తనదైన స్టైల్‌లో ఓ పాట రూపొందించారు.

చౌర‌స్తా బ్యాండ్ క‌రోనాపై ప్ర‌త్యేక సాంగ్స్ రూపొందించింది. వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేలా ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’ అంటూ ఈ బృందం పాడిన పాట సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కూడా కరోనా మీద స్వయంగా తన స్టైల్లో పాట రాసి,పాడారు.కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జియో బాయ్స్ అనే గ్రూప్ కరోనా మీద అద్భుతమైన పాట రాసారు …మీరు కూడా విని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి


End of Article

You may also like