మనవరాలి మరణం తట్టుకోలేక అవ్వ కూడా ఆమె వెంటే వెళ్ళిపోయింది.. అసలేం జరిగిందంటే..?

మనవరాలి మరణం తట్టుకోలేక అవ్వ కూడా ఆమె వెంటే వెళ్ళిపోయింది.. అసలేం జరిగిందంటే..?

by Megha Varna

Ads

మనవరాలి మరణాన్ని తట్టుకోలేక అవ్వ కూడా ప్రాణాలు విడిచింది. మనవరాలు నేనున్నానంటూ ఎప్పుడూ దగ్గరుండి చూసుకునేది. కానీ ఆమె చనిపోయింది అని తెలిసే సరికి అవ్వ కూడా ప్రాణాలు విడిచింది. ఎప్పుడు బాగా చూసుకుంటూ ఉండేది మనవరాలు. అలానే మందులు ఇచ్చేది. ఇంత ప్రేమగా చూసుకునే మనవరాలు విడిచి వెళ్ళి పోయిన వార్త తట్టుకోలేక పోయింది అవ్వ.

Video Advertisement

దీంతో ఆమె కూడా మృతి చెందింది. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే.. 17 ఏళ్లుగా మనవరాలు, అవ్వ కలిసి వున్నారు. ఎంతో ప్రేమగా వీళ్ళు ఉండేవారు. అకస్మాత్తుగా మనవరాలు చనిపోవడం అనేది తట్టుకో లేక పోయింది. వారం రోజుల క్రితం కూలి పనులకు వెళ్లిన మనవరాలు పాము కాటుకు గురై మంగళవారం చని పోయింది. ఈ ఘటన గడివేముల మండలం బిలకల గూడూరు లోని చోటు చేసుకుంది.

కాటెపోగు వెంకట సుబ్బయ్య, వెంకట లక్ష్మమ్మలకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. చివరి కూతురు రాణెమ్మ కి 17 సంవత్సరాలు. తాను కూడా తల్లిదండ్రులతో పాటు కూలి పనులు చేసేది. రోజు లాగే ఆమె పనికి వెళ్ళింది. అయితే పొలం లో ఆమె కలుపు తీస్తుండగా అక్కడ పాము కాటేయడం తో చనిపోయింది. నంద్యాల ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది.

అయితే ఆ విషయం తెలిసిన అవ్వ రాణెమ్మ జేజమ్మ వెంకట లక్ష్మమ్మ (72) కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ లో తీవ్ర విషాదం అలుముకుంది. అవ్వ, మనవరాలి మరణం ఒకే కాలం లో సంభవించడంతో ఆ గ్రామ వాసులు హృదయ విదారకంగా దీని గురించి చెప్పుకుంటున్నారు.


End of Article

You may also like