హైదరాబాద్: ప్రేమించుకున్నారు…ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు…! కానీ నడిబజారులో దారుణం.!

హైదరాబాద్: ప్రేమించుకున్నారు…ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు…! కానీ నడిబజారులో దారుణం.!

by Sainath Gopi

Ads

ఇటీవలి కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోజులు మారుతున్నా ప్రేమ వివాహాలపై ఉన్న అభ్యంతరాలు మాత్రం తొలగడంలేదు. ఈ క్రమంలో పరువు హత్యలు కూడా ఎక్కువగా జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగా ఓ యువకుడిని నడిరోడ్డుపైనే నరికి చంపారు.

Video Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్వాడీ మాలి క్షత్రియ వర్గానికి చెందిన నీరజ్ కుమార్ రాజస్థానీ మూలాలు ఉన్న వ్యక్తి. అతను  గౌలి యాదవ కులానికి చెందిన సంజనను ప్రేమించి ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి నెలల వయసు ఉన్న బాబు కూడా ఉన్నాడు.

అయితే.. కులాంతర వివాహం చేసుకోవడంపై సంజన కుటుంబ సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు. నీరజ్ కుమార్ పై కోపం పెంచుకుని అతన్ని హత్య చేయడానికి కూడా వెనుకాడలేదు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్న నీరజ్.. సంజనను పెళ్లి చేసుకున్నప్పుడే తనకు ప్రాణహాని ఉందని  అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. గత శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

నీరజ్ రోడ్డు దాటుతున్న సమయంలో.. నడి రోడ్డుపైనే అందరు చూస్తూ ఉండగానే.. దుండగులు నీరజ్ తలపై  గ్రానైట్ రాయితో మోదారు. ఆ తరువాత కొబ్బరి బొండాల కత్తితో దాదాపు ఇరవై సార్లు పొడిచారు. అతనిని హత్య చేయడం కోసం చాలా కాలంగానే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. అతని రాకపోకలను గమనిస్తూ గత శుక్రవారం నడిరోడ్డుపైనే అతనిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్య బేగంబజార్ లో చోటు చేసుకుంది. అక్కడ స్థానికులు నివ్వెరపోయారు. అర్ధరాత్రి హెచ్చు సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. శనివారం బంద్ పాటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


End of Article

You may also like