Ads
జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే రోహిణి, సత్య శ్రీ కూడా జబర్దస్త్ లో రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనకు కొత్త నటి జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. తనే వర్ష. వర్ష ఎక్కువగా హైపర్ ఆది టీం లో కనిపిస్తారు. అలాగే రాకింగ్ రాకేష్, వెంకీ మంకీస్ టీమ్స్ తో కలిసి నటిస్తున్నారు.
Video Advertisement
వర్ష అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి సీరియల్స్ లో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మాన్సీ పాత్రతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వర్ష కొంత కాలం క్రితం యాంకర్ అనసూయపై చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.
కొంత కాలం క్రితం తను రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరో ఒక పిల్లాడు తనని ఫోటో అడగడంపై మొదలైన ఒక చర్చలో ఆ పిల్లాడి ఫోన్ తీసుకొని పగలగొట్టారు అనసూయ. ఆ పిల్లాడి తల్లి పోలీస్ స్టేషన్లో అనసూయపై కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై వర్ష మాట్లాడిన ఒక వీడియో యూట్యూబ్ లో, ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్ లలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో వర్ష “తనకి కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్లు ఎవరితోనైనా ఫోటో దిగాలి అనుకుంటే, వాళ్లు కూడా ఇలాగే ఫోన్ పగలగొడతే ఎలా అనిపిస్తుంది? ఒక వేళ ఆ పిల్లాడి స్థానంలో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే అప్పుడు ఇలా చేసినా బాగుండేది. కానీ చిన్న పిల్లాడు ఎంత బాధ పడి ఉంటాడు? అతని తల్లి ఎంత బాధ పడి ఉంటుంది? మీకు ఇంత పేరు వచ్చిందంటే దానికి కారణం ఆడియన్స్. “మీ వల్లే మాకు పేరు వచ్చింది” అని సోషల్ మీడియాలో పెట్టడం కాదు. మీరు యాంకర్. మాట్లాడే విధానం కూడా కొంచెం చూసుకోండి” అని అన్నారు.
watch video :
అసలు ఇది జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. వర్ష కూడా అప్పుడే ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి కారణం బహుశా వర్ష ఇటీవల జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చారు. దాంతో కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మళ్లీ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారేమో.
Also watch :
End of Article