Home News “నీ యావ ఆడవాళ్ళ మీద నుంచి మగవాళ్ళ మీదకి మళ్లిందా?”… అంటూ పవన్ పై ఫైర్ అయిన జగన్ అభిమాని.!

“నీ యావ ఆడవాళ్ళ మీద నుంచి మగవాళ్ళ మీదకి మళ్లిందా?”… అంటూ పవన్ పై ఫైర్ అయిన జగన్ అభిమాని.!

by Sainath Gopi

ఈ మధ్యన తాడేపల్లి గూడెంలో జెండా పేరుతో సభను ఏర్పాటు చేశారు జనసేన, తెదేపా కూటమి. ఆ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పెళ్లిళ్లపై సీఎం జగన్ చేస్తున్న విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తన నాలుగో భార్య జగన్ ఏమో నాకు తెలియదు అంటూ సెటైర్లు వేశారు. సీఎం జగన్ భార్యను భారతి గారు అని మేము మర్యాదిస్తాము, కానీ ఆయన మాత్రం మా భార్యలని పెళ్ళాలు అని సంబోధిస్తున్నారన్నారు.

అదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు భారతి గారు అని పవన్ కళ్యాణ్ నిలదీసిన సంగతి తెలిసిందే. జగన్ పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాము, సలహా ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి.

jagan fan comments on pawan kalyan

నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ ఓ రేంజ్ లో జగన్ దుమ్ము దులిపేశారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ మాటలపై వైఎస్సార్సీపీ మహిళ లోకం మండిపడింది. ఒక యువతి సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడింది. నువ్వు ప్యాకేజీ స్టార్ వి, నువ్వు జగన్ గురించి అరేయ్ ఒరేయ్ అని మాట్లాడుతున్నావా నీకు ఎంత ధైర్యం. ఇప్పటికే జగనన్న నీకు నీ దత్తత తండ్రికి చుక్కలు చూపిస్తున్నాడు.

జగనన్నని నాలుగో పెళ్ళాం అంటున్నావు నీ యావ ఆడవాళ్ళ మీద నుంచి మగవాళ్ళ మీదకి మళ్లీందా.. నువ్వు నీ దత్తత తండ్రి ఒక్కొక్కరుగా పోరాడలేక కలిసి పోరాడుతున్నారంటేనే జగన్ బలం తెలుస్తుంది. ఇంకొకసారి మా జగనన్నని అరేయ్ అన్నా,సీఎం సీటుకి మర్యాద ఇవ్వకపోయినా పళ్ళు పీకి చేతిలో పెడతాం. జగనన్న గురించి తప్పుగా మాట్లాడితే వైఎస్సార్సీపీ మహిళ లోకం చూస్తూ ఊరుకోదు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. అయితే దీనిపై జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

You may also like