JANHVI KAPOOR: తిరుమలలో మోకాళ్ల పర్వతం దగ్గర “జాన్వీ కపూర్” ఏం చేశారో తెలుసా..? ఈ వీడియో చూశారా..?

JANHVI KAPOOR: తిరుమలలో మోకాళ్ల పర్వతం దగ్గర “జాన్వీ కపూర్” ఏం చేశారో తెలుసా..? ఈ వీడియో చూశారా..?

by Mohana Priya

Ads

శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించి, ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్న నటి జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో జాన్వీ తెలుగులోకి అడుగు పెడుతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. సినిమా బృందం అంతా కూడా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల ఒక ఫోటో విడుదల చేశారు.

Video Advertisement

ఇప్పుడు జాన్వీ కపూర్, రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పూజ వేడుక ఇటీవల జరిగింది. అయితే జాన్వీ కపూర్ కి భక్తి చాలా ఎక్కువ. తిరుపతికి తరచుగా వెళ్తూ ఉంటారు. ఇటీవల కూడా అలాగే తిరుపతికి వెళ్లారు. తిరుపతికి జాన్వీ కపూర్ తో పాటు, తన స్నేహితులు, పిన్ని అయ్యే హీరోయిన్ మహేశ్వరి కూడా వెళ్తూ ఉంటారు. ఇటీవల జాన్వీ కపూర్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతికి వెళ్లారు. అయితే జాన్వీ కపూర్ తో పాటు తన స్నేహితుడు ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ కూడా వెళ్లారు.

janhvi kapoor conditions to producers..!!

ఓర్రీ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి కనిపిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తిరుపతికి జాన్వీ కపూర్ తో కూడా వెళ్లారు. ఈ వీడియోని ఓర్రీ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు. ఇందులో జాన్వీ కపూర్ మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు వీఐపీ దర్శనానికి వెళ్లిపోతారు. కానీ జాన్వీ కపూర్ తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా మెట్లు ఎక్కి కాలినడకన వెళ్తారు.

janhvi kapoor tirupati darshan

ఈసారి కూడా అలాగే వెళ్లారు.  జాన్వీ కపూర్ తో పాటు తన స్నేహితులు కూడా మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్లతో మెట్లు ఎక్కి వెళ్లారు. దాంతో జాన్వీ కపూర్ భక్తి, శ్రద్ధ లని చూసిన వాళ్ళందరూ కూడా ఆమెని మెచ్చుకుంటున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి ఇంత విలువ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని అంటున్నారు. జాన్వీ కపూర్ తిరుపతికి తరచుగా వెళ్తూ ఉంటారు. తిరుపతికి వెళ్లడం తనకి చాలా ఇష్టం అని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 50 సార్లు జాన్వీ కపూర్ తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నాను అని అన్నారు.

watch video :

ALSO READ : చిరంజీవితో యమున కలిసి నటించిన ఈ సినిమా ఏదో తెలుసా? ఇద్దరి డాన్స్ హైలైట్.!


End of Article

You may also like