Ads
అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీర్ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. అమ్మడి అందాలకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే జాహ్నవి బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది గాని తగిన గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయింది. అయితే తాజాగా జాహ్నవి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని గుడికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
Video Advertisement
అయితే ప్రస్తుతం జాహ్నవి ఎన్టీఆర్ సరసన దేవరా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మూవీ గురించి మాట్లాడుతూ దేవర సెట్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత తనకి మొదటిసారి హీరోయిన్ ఫీలింగ్ వచ్చిందని ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వర్క్ షాప్ లాగా అనిపించాయని చెప్పి సినిమా మీద అమాంతం హైప్ పెంచేసింది. జాహ్నవి ఈరోజులో చెప్పిందంటే కొరటాల శివ జాహ్నవికి ఎంతో కీలకమైన పాత్ర ఇచ్చి ఉంటాడని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
తాజాగా నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా దేవర సినిమా గురించి అప్డేట్ ఇస్తూ దేవర మూవీని అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నామని క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలియజేశారు. విఎఫ్ఎక్స్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నామని చెప్పారు. దీంతో అట నిర్మాత కళ్యాణ్ రామ్, ఇటు హీరోయిన్ జాహ్నవి ఇచ్చిన అప్డేట్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
End of Article