Ads
శనివారం మావోయిస్టులు సిఆర్పిఎఫ్ పోలీసులని అలాగే 700 మంది పోలీసులను చుట్టుముట్టి బస్తర్ లోని బీజాపూర్ లో ఎటాక్ చేశారు. వీరిలో సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ తో పాటు దీపక్ బృందం అయిన చత్తీస్గడ్ పోలీసులు ఉన్నారు. దీపక్ దాడి జరుగుతోందని చింతించకుండా కాల్పుల నుండి తన సహచరులను కాపాడడం ప్రారంభించారు. ఈ దాడిలో ఆయన ఉన్నచోట ఒక పేలుడు సంభవించడంతో ఆయన అమరవీరులు అయ్యారు. ఈ విషయాన్ని దైనిక్ భాస్కర్ కి ఒక జవాన్ చెప్పారు.
Video Advertisement
ఆయన మాట్లాడుతూ “నక్సలైట్లు అకస్మాత్తుగా మాపై భారీ కాల్పులు ప్రారంభించారు. మా సహచరులలో కొందరు గాయపడ్డారు. మేము గాయపడినవారిని మధ్యలో ఉంచి నక్సలైట్లను బుల్లెట్లతో చుట్టుముట్టడం ప్రారంభించాం. దీపక్ సర్ మమ్మల్ని కాల్పుల నుండి తప్పించడానికి ప్రయత్నించారు. నాలుగు నుండి ఐదుగురు సైనికుల ప్రాణాలను రక్షించే క్రమంలో ఈఐడి పేలుడులో చిక్కుకున్నారు. ఇందులో ఆయన అమరులయ్యారు” అని చెప్పారు.
ఎస్ఐ, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ తో సహా 24 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. దీపక్ జంజ్ గిర్ జిల్లాలోని పిహ్రిడ్ నివాసి. 1990 సెప్టెంబర్ 6వ తేదీన జన్మించిన దీపక్, 2013 సెప్టెంబర్ 16వ తేదీన పోలీస్ ఫోర్స్ లో చేరారు. దీపక్ కి 2019 లో వివాహం జరిగింది. దీపక్ చదువులో కూడా కూడా ఉండేవారు. దీపక్ నక్సలైట్ల గుహలోకి ప్రవేశించి వారి పై అనేక ఆపరేషన్లు చేశారు. దీపక్ డిప్లాయ్మెంట్ బీజాపూర్ లో ఉంది.
దీపక్ తన తోటి జవాన్లతో కలిసి ఒక ఆపరేషన్ కోసం నక్సలైట్ల గుంపు ఉన్న టారెమ్ లోపలి భాగంలోకి ప్రవేశించారు. దీపక్ నక్సలైట్ ఎన్కౌంటర్ ఆపరేషన్ టీంని లీడ్ చేస్తున్నారు. ఫైరింగ్ పూర్తయిన తర్వాత జవాన్లు వారి స్వస్థలాలకు చేరుకున్నారు. వారిలో కొంత మంది జవాన్లు కనిపించలేదు. ఆ కనిపించని వారిలో దీపక్ కూడా ఉన్నారు. దాంతో దీపక్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు.
దీపక్ తండ్రి రాధే లాల్ భరద్వాజ్, తల్లి పరమేశ్వరి భరద్వాజ్ వెంటనే బీజాపూర్ కి బయలుదేరారు. ఆరోజు మధ్యాహ్నం వరకు దీపక్ కి సంబంధించిన ఎటువంటి సమాచారం వారికి తెలియలేదు. బ్యాక్అప్ టిప్ టారెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవ్నాగుడ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఒక చెట్టు దగ్గర దీపక్ మృతదేహం లభించింది.
End of Article