అబ్బాయిల చూపులన్నీ అక్కడే… “జాన్వీ కపూర్” చేసిన ఈ కామెంట్స్ పై మీ కామెంట్ ఏంటి.?

అబ్బాయిల చూపులన్నీ అక్కడే… “జాన్వీ కపూర్” చేసిన ఈ కామెంట్స్ పై మీ కామెంట్ ఏంటి.?

by Mounika Singaluri

Ads

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె నటి శ్రీదేవి కపూర్ పెద్ద కూతురు. జాన్వీకపూర్ బాలీవుడ్ లో దడక్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. దాని తర్వాత వరుసుగా సినిమాల మీద సినిమాలు చేస్తూ తన నటనకి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య కొన్ని లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసుకుంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది జాన్వీ కపూర్.

Video Advertisement

అయితే ఈ సంవత్సరం 2024లో మొట్టమొదటి తెలుగు సినిమాలో నటించి టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ “దేవర” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా “ది ఆర్చీస్” అనే వెబ్ సిరీస్ తో ఈ మధ్య సినీ ప్రవేశం చేసింది. వీళ్లిద్దరూ కలిసి ఒక ప్రముఖ టాక్ షో “కాఫీ విత్ కరణ్” లో పాల్గొన్నారు.

ఈ షోలో అక్క చెల్లెలు ఇద్దరు వాళ్ల పర్సనల్ విషయాలను చాలా షేర్ చేసుకున్నారు. కరణ్ వీళ్ళిద్దరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పారు. అయితే ఒక ప్రశ్నగా “మగవాళ్ళకి నిన్ను చూసిన వెంటనే ఏది నచ్చుతుంది?” అని అడగగా దానికి జాన్వీ “అందరు అబ్బాయిలు నా కళ్ళు చూస్తున్నాను అని అంటారు. కానీ వాళ్ళ కంటి చూపు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు. వాళ్ళు అదే చూస్తారు” అని చెప్పుకొచ్చింది జాన్వీ.

అయితే అదే అంటే ఏంటి అనే ప్రశ్న అందరిని ఆసక్తి చూపిస్తుంది. కాఫీ విత్ కరణ్ షో వల్ల ఎన్నో మంది ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్నారు. అయితే జాన్వీ కి కూడా అది తప్పలేదు. ఇప్పుడు ఈ ప్రశ్న మీద అందరూ జాన్వీ ని కాంట్రవర్సీకి గురి చేస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర షూటింగ్ సమయంలో జనవరి 5న తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది జాన్వీ. ప్రతి సంవత్సరం శ్రీదేవి పుట్టినరోజు జాన్వీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటుంది.

https://www.instagram.com/p/C1qR2ABo6l6/


End of Article

You may also like