“ఎవరు మీలో కోటీశ్వరులు”కి వీడ్కోలు పలికిన జూనియర్ ఎన్టీఆర్.? లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే..?

“ఎవరు మీలో కోటీశ్వరులు”కి వీడ్కోలు పలికిన జూనియర్ ఎన్టీఆర్.? లాస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే..?

by Mohana Priya

Ads

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీ లో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక క్విజ్ ప్రోగ్రాం మొదలవ్వడం, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాంకి హోస్ట్ చేయడం అనేవి ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

Video Advertisement

jt ntr finishes shooting of evaru meelo koteeswarulu

అయితే ఈ ప్రోగ్రాంకి జూనియర్ ఎన్టీఆర్ వీడ్కోలు పలికారు. ఒకే రోజులో రెండు ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ప్రోగ్రాం షూటింగ్ ముగించారు జూనియర్ ఎన్టీఆర్. చివరి ఎపిసోడ్ నవంబర్ నెలలో టెలికాస్ట్ అవుతుంది అని సమాచారం. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో కానీ, లేదా చివరి ఎపిసోడ్ లో కానీ మహేష్ బాబు అతిథిగా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ముగిసింది కేవలం మొదటి సీజన్ మాత్రమే. ఈ ప్రోగ్రాంకి తప్పకుండా రెండవ సీజన్ ఉంటుంది. కానీ ఆ ప్రోగ్రాం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారా? లేదా మరెవరైనా హోస్ట్ చేస్తారా? అనేది మాత్రం ఇంకా తెలియదు.


End of Article

You may also like