షేర్‌షా సినిమాపై కమల్ హాసన్ షాకింగ్ వ్యాఖ్యలు.!

షేర్‌షా సినిమాపై కమల్ హాసన్ షాకింగ్ వ్యాఖ్యలు.!

by Mohana Priya

షేర్‌షా సినిమాపై ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మేజర్ విక్రమ్ బాత్రా జీవిత ఆధారంగా తీసారు. ఈ సినిమాకి పంజాబ్ సినిమా దర్శకత్వం వహించిన విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి ఎంతో మంది ప్రముఖులు నుండి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరో కమల్ హాసన్ గారు కూడా ఈ సినిమాని అభినందించారు. తన సోషల్ మీడియాలో కమల్ హాసన్ గారు ఈ విధంగా రాశారు.

Video Advertisement

 

“చిన్నప్పటి నుంచి ఒక సినిమా అభిమానిగా అలాగే ఒక దేశభక్తుడి కొడుకుగా సినిమాల్లో ఇండియన్ ఆర్మీ గురించి చూపించినా విధానం నాకు కోపం తెప్పించింది. కానీ ఈ సినిమా మాత్రం అందుకు మినహాయింపు. ఈ సినిమా చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. విష్ణువర్ధన్ లాంటి ప్రతిభ ఉన్న దర్శకులను నమోదు చేసినందుకు ధర్మ ప్రొడక్షన్స్ కి ధన్యవాదాలు. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా కి కియారా అద్వాని కి కంగ్రాచ్యులేషన్స్” అని రాశారు.


You may also like