నేరుగా ఓటీటీ లోకి కీర్తి సురేశ్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. డిసప్పాయింట్ అవుతున్న ప్రేక్షకులు! ఎందుకంటే.?

నేరుగా ఓటీటీ లోకి కీర్తి సురేశ్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. డిసప్పాయింట్ అవుతున్న ప్రేక్షకులు! ఎందుకంటే.?

by Harika

Ads

కోలీవుడ్ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న చిత్రం సైరన్. ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇందులో జయం రవి ఒక జైలర్ గా కనిపించగా కీర్తి సురేష్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ జయం రవికి ప్రేయసిగా నటించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లు, టీజర్లు విడుదల చేసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ బాగా నచ్చి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాట పడిపోతున్నారు. చిత్ర బృందం కూడా త్వరలోనే ఈ చిత్రం వెండి తెర మీదకు వస్తుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జయం రవి ఫాన్స్ కు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుందట. అది కూడా ఈ జనవరి 26న డైరెక్ట్ గా జి5 లోకి ఈ చిత్రం విడుదల కానుంది అని తెలిసిన వెంటనే ఫాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు.

ఎందుకంటే జయం రవి ముందు సినిమా కూడా నేరుగా ఓటీటీ లోకే రావడం విశేషం. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఇప్పటికీ అఫీషియల్ గా చిత్ర బృందం ఏమీ ప్రకటించలేదు కానీ సామాజిక మాధ్యమాలలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటిస్తున్న జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లకు కూడా ఈ మధ్య థియేటర్లలో సినిమాలు ఎక్కువ పడలేదు.

ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు వీళ్ళని థియేటర్లో చూద్దామని ఆసక్తి పడుతున్న సమయంలో ఈ సినిమా గురించి తెలిసి అందరూ పండగ చేసుకున్నారు కానీ ఇది కూడా థియేటర్లలో రావట్లేదు అని తెలిసి అందరి ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. దీనికి కారణాలు ఏమో, ఏంటో తెలియదు కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం త్వరలోనే రాబోతుంది అని తెలుస్తుంది.


End of Article

You may also like