KGF డైరెక్టర్ ఆ విషయంలో ఇలా ఉండకుంటే బాగుండేదేమో.. అప్ సెట్ అయిన ఫ్యాన్స్..!

KGF డైరెక్టర్ ఆ విషయంలో ఇలా ఉండకుంటే బాగుండేదేమో.. అప్ సెట్ అయిన ఫ్యాన్స్..!

by Sunku Sravan

Ads

కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ముందుకు పోతున్నారు ఆయన. ఆయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ఉగ్రం, కేజిఎఫ్ చాప్టర్ -1, మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన కేజిఎఫ్ 2 సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

సలార్ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నది. ఇదిలా ఉండగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరోయిన్ల ఎంపిక బాగాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే కేజిఎఫ్ చాప్టర్ 1, కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీస్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. శ్రీనిధి కి బదులుగా మరో స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసి ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సలార్ మూవీలో ప్రభాస్ కు జోడిగా ప్రశాంత్ నీల్ శృతిహాసన్ ను ఎంపిక చేశారు అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకి ఎంపిక చేసిన సమయానికి శృతిహాసన్ కి ఫ్యాన్స్ లో క్రేజ్ తగ్గిందని, శృతి సీనియర్ హీరోలతో జోడిగా నటిస్తున్నందువల్ల ప్రభాస్ అభిమానులను భాదేస్తోంది.

ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ కాంబినేషన్లో హీరోయిన్ గా దీపికా పడుకొనే ఎంపిక అయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈమె ఎంపిక విషయంలో తారక్ అభిమానులు సంతృప్తితో లేరనే సంగతి మనకు తెలిసిందే. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నిల్ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచిన హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయంపై ప్రశాంత్ నీల్ ఏవిధంగా స్పందిస్తారో ముందు ముందు తెలుస్తుంది.


End of Article

You may also like