Ads
కృతి శెట్టి ఇప్పటికి మూడు సినిమాల్లో నటించింది. మూడు సినిమాలు కూడా హిట్ అవ్వడం విశేషం. టాలీవుడ్ లోకి అందాల తార కృతి శెట్టి మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఉప్పెన సినిమాలో నటించి ఎంట్రీ ఇచ్చింది. బేబమ్మ పాత్రలో అదరకొట్టేసిన కృతి శెట్టి ఆ తర్వాత నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమాలో నాగ చైతన్య పక్కన కృతి శెట్టి నటించి మరొక సారి ఈ ముద్దుగుమ్మ అలరించింది.
Video Advertisement
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆలీతో సరదాగా షో కు ఈమె వచ్చి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు చూసేద్దాం. మొదట యాడ్స్ షూట్స్ చేసేదట కృతి. ఆ తరవాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అని చెప్పింది. అదే విధంగా ఉప్పెన సక్సెస్ తనకి చాలా ఆనందం అనిపించింది అని ఆమె అంది.
ఆ సినిమా సక్సెస్ అవ్వడం తో మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారని… ఉప్పెన సినిమా తర్వాత చిరంజీవి తనకి ఒక బహుమతి ఇచ్చారట. స్వయంగా ఆయన చేతుల తో రాసిన ఒక లెటర్, గిఫ్ట్ పంపించారని కృతి శెట్టి చెప్పారు. ఆ లెటర్ లో చిరంజీవి ”యు ఆర్ ఏ బోర్న్ స్టార్” అని రాశారని..
అంత పెద్ద హీరో మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించి దానిని ఫ్రేమ్ కట్టించానని చెప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇష్టమని రంగస్థలం లో చరణ్ పాత్ర బాగుందని కృతి శెట్టి చెప్పింది. అవకాశం దొరికితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించాలని ఉందంది.
End of Article