ఆకలి బాధలు తట్టుకోలేక రోడ్డుపై చనిపోయిన కుక్కని తిన్న బాధితుడు!

ఆకలి బాధలు తట్టుకోలేక రోడ్డుపై చనిపోయిన కుక్కని తిన్న బాధితుడు!

by Megha Varna

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దాదాపు అన్ని దేశాలు ఈ విపత్తును ఎదురుకుంటున్నాయి కాగా అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఇతర దేశాలలో చనిపోయిన వారి చివరి చూపు కూడా చూసుకోవడానికి వీలులేని ఎన్నో హృదయ విషాదకర సంఘటనలు చాలానే చూసాం.కాగా వలస కూలీలు ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోగా కాలినడకన తమ ప్రాంతాలకు చేరుకొనే లోపు చనిపోయిన సంఘటనలు ఈ లాక్ డౌన్ చూసాం.అయితే ఆకలి తట్టుకోలేక ఓ వ్యక్తి రోడ్ మీద కూర్చొని చనిపోయిన కుక్క మాంసాన్ని తినడం అందరి కళ్ళు చెమర్చేలా చేసింది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

 

ప్రాధామ్యాన్ సింగ్ నౌరాక అనే వ్యక్తి బైక్ మీద ఢిల్లీ నుండి జైపూర్ రహదారి మీదగా వెళ్తుండగా అతనికి ఓ హృదయ విషాదకర సంఘటన కనిపించింది.దానితో అతను ఆగి ఆ వ్యక్తి దగ్గరకి వెళ్ళాడు .రోడ్ మీద కూర్చొని చనిపోయిన కుక్క మాంసం తింటున్నాడు ఓ వ్యక్తి.కట్ చీఫ్ సహాయంతో అతనికి దగ్గరకి వెళ్ళాడు ప్రాధామ్యాన్ ఎందుకంటే అక్కడ తీవ్రమైన చెడు వస్తుంది.ఎందుకు మీరు ఇలా కుక్క మాంసాన్ని తింటున్నారు అని అడగగా ఆకలి వేస్తుంది భోజనం తిని చాలా కాలం అయ్యింది.ఈ లాక్ డౌన్ లో భోజనం పెట్టేవాళ్ళు కూడా లేరు అని చెప్పాడు ఆ వ్యక్తి.

 

దీంతో తీవ్ర ఆవేదన చెందిన ప్రాధామ్యాన్ ఆ కుక్క ను తినకు ఆలా ఈ మాంసం తింటే నువ్వు చనిపోతావ్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ వ్యక్తికీ అందచేశారు ప్రాధామ్యాన్.కాగా కొన్ని డబ్బులు కూడా అతనికి అందచేసాడు.రోడ్ల మీద ఇంత మంది కార్లు ,బైకులు వేసుకుని ఇతని ముందు నుండి వెళ్తున్నారు గాని ఎవరు ఆగి సహాయం చెయ్యట్లేదు ఎవరికీ మానవత్వం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు ప్రాధామ్యాన్.సదరు సంఘటన ను వీడియో తీసి పేస్ బుక్ లో అప్లోడ్ చేసి ఆ వ్యక్తికీ సహాయం చెయ్యాలసిందిగా ప్రజలను అభ్యర్ధించారు ప్రాధామ్యాన్.

 


You may also like