“సందీప్ కిషన్” కుమారి ఆంటీకి ఎంత డబ్బు సాయం చేసారో తెలుసా.?

“సందీప్ కిషన్” కుమారి ఆంటీకి ఎంత డబ్బు సాయం చేసారో తెలుసా.?

by kavitha

Ads

కొన్ని రోజుల నుండి  సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కుమారీ ఆంటీ పేరే వినిపిస్తోంది. ఆమెకు సంబంధించిన వీడియోలు, వార్తలు నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

Video Advertisement

ఆమె ఫుడ్ స్టాల్ గురించి వైరల్ అవడంతో ఆ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున జనాలు ఆమె స్టాల్ దగ్గరికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో  ఆమె స్టాల్ ను పోలీసులు క్లోజ్ చేయడం సిఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో మళ్ళీ ఆమె ఫుడ్ స్టాల్ ఓపెన్ అయ్యింది. మళ్ళీ జనాలతో ఆమె స్టాల్ కిటకితలాడుతోంది.
కుమారీ ఆంటీ ట్రెండింగ్ లోకి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా అందరు స్ట్రీట్ ఫుడ్స్ మీదే దృష్టి పెట్టారు. కుమారీ ఆంటీ విషయంలో ఏకంగా ముఖ్యమంత్రి స్పందించడంతో మరింతగా వార్తల్లో నిలిచింది. కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు ముఖ్యమంత్రి వస్తారని వార్తలు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నిరుద్యోగులు కుమారీ ఆంటీ స్టాల్ కు వెళ్లి నిరసన కూడా వ్యక్తం చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ కుమారీ ఆంటీ వంటి వారిని వెతికి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కుమారీ ఆంటీ గురించి,  నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆమె పూర్తి పేరు సాయి కుమారి. గత పదమూడు సంవత్సరాలుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టాల్ పెట్టకముందు  సింగర్ హేమ చంద్ర ఇంట్లో పని చేసేవారంట. ఆ తరువాత ఫుడ్ స్టాల్ మొదలుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, ఆలీ లాంటి సెలెబ్రెటీలు సైతం కూరలు తీసుకెళ్తారని కుమారీ ఆంటీ వెల్లడించారు.
రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ కూడా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు వెళ్లి భోజనం తిని వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫుడ్ తిన్న తరువాత సందీప్ కిషన్ కుమారీ ఆంటీకి పదివేల రూపాయలు ఇచ్చారట. కుమారీ ఆంటీకి ఇంతగా క్రేజ్‌రావడంతో బిగ్ బాస్ షోలోకి ఆమెను తీసుకుంటారేమో అంటూ నెటిజెన్లు కౌంటర్లు వేస్తున్నారు.

Also Read: OTT లో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ థ్రిల్లర్ సినిమాలో ఏముంది.?

 

 


End of Article

You may also like