తల్లిదండ్రులకి మిస్ యు అని లెటర్ రాసి ఆత్మహత్య…ఇంతకీ ఏమైందంటే..?

తల్లిదండ్రులకి మిస్ యు అని లెటర్ రాసి ఆత్మహత్య…ఇంతకీ ఏమైందంటే..?

by Megha Varna

Ads

రోజులు మారుతూ ఉన్నా సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా కట్నం పై వేధింపులు అలానే కొనసాగుతున్నాయి. న్యాయం జరగాలంటూ అమ్మ నాన్న మిస్ యు అని సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది ఒక వివాహిత. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

Video Advertisement

దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల శోభ వెంకట్‌ రెడ్డిల కూతురు ప్రవళికను (28) బోర్గాం గ్రామానికి చెందిన చామకూర మహేశ్‌కు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారు. వీరికి పెళ్లై ఐదు సంవత్సరాలు గడుస్తోంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని..

తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవడం జరిగింది. అన్ని సవ్యంగా సాగుతున్నాయి కదా అని అనుకున్నారు. ఇంతలోనే వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకో లేక శుక్రవారం దుబ్బాక లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిపించేటప్పుడు కట్న కానుకలను, బంగారాన్ని ఇచ్చారు.

మహేష్ ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అదనపు కట్నం కావాలని భర్త, అత్త వారి దగ్గర్నుంచి వేధింపులు రావడంతో… ఆరు నెలల క్రితం తన బాధను చూడలేక తల్లిదండ్రులు నాలుగు లక్షల రూపాయలని ఇచ్చారు. అంతటితో ఆగక ఇంకా అదనపు కట్నం కావాలని వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె తట్టుకో లేక శుక్రవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రవళిక తల్లి ఫిర్యాదు చేయడంతో భర్త చామకూర మహేశ్, అత్త చామకూర రాజవ్వ, సమీప బంధువులైన మేనమామలు, మేనత్త పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. భర్త, అత్త తో పాటు వారి సమీప బంధువుల పై వరకట్నం కేసు నమోదు చేసారు.


End of Article

You may also like