Home Filmy Adda “మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది” అంటూ మహేష్ బాబు సంచలన కామెంట్స్..!

“మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది” అంటూ మహేష్ బాబు సంచలన కామెంట్స్..!

by Mohana Priya

సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఇటీవల సింగరేణిలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. మహేష్ బాబు ఈ విధంగా రాశారు. “సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరం మనం సమాజంలో ఎంతగా దిగజారిపోయామో గుర్తు చేస్తుంది. “మా కూతుళ్లు సురక్షితంగా ఉంటారా?” అనేది ఎప్పటికీ ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఇది నిజంగా దారుణం .. ఆ కుటుంబం ఎలా ఉన్నారో ఊహించలేకపోతున్నాను!” అని అన్నారు.

mahesh babu comments on singareni incident

వీలైనంత తొందరగా చర్య తీసుకొని ఆ చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నేను అధికారులని కోరుతున్నాను అని రాశారు మహేష్ బాబు. మహేష్ బాబు మాత్రమే కాకుండా మంచు మనోజ్ ఇంకా ఇతర ప్రముఖులు ఈ ఘటనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

You may also like