“మహేష్ బాబు-త్రివిక్రమ్” సినిమా టైటిల్ అదేనా..? ఈసారి కూడా అదే సెంటిమెంట్ తో..?

“మహేష్ బాబు-త్రివిక్రమ్” సినిమా టైటిల్ అదేనా..? ఈసారి కూడా అదే సెంటిమెంట్ తో..?

by Megha Varna

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు తెర మీదకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. గతంలో అతడు, ఖలేజా సినిమాలు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చాయి.

Video Advertisement

ఇక రాబోతున్న ఈ సినిమా గురించి చూస్తే… మహేష్ బాబు కి జంటగా పూజాహెగ్డే నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రాబోతుంది.

నిర్మాతగా చిన్నబాబు వ్యవహరిస్తున్నారు. దసరా తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే… పార్ధు, అర్జునుడు అనే పేర్లు వినపడ్డాయి. తాజాగా అయోధ్య లో అర్జునుడు అనే టైటిల్ ని ఫైనల్ చేయవచ్చనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. త్రివిక్రమ్ చేసిన గత నాలుగు చిత్రాలు కూడా ‘ఆ’ అక్షరం తో మొదలయ్యాయి. అందుకే రాబోతున్న ఈ టైటిల్ ను కూడా ‘ఆ’ తో మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు 28వ సినిమా అయ్యాక.. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ చిత్రం చేయనున్నారు. రాజమౌళి హాలీవుడ్ ఏజెన్సీ CAA కి సైన్ చేసారు. మహేష్ కోసం రాజమౌళి ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి ఇటీవల టోర్నడో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం కెనడా వెళ్లారు. అప్పుడు అక్కడ అయినా మహేష్ బాబుతో సినిమా తీసుకొస్తున్నట్లు చెప్పారు. జేమ్స్ బాండ్ లాంటి ప్రాజెక్ట్ ను తీసుకు వస్తున్నట్లు రాజమౌళి అనౌన్స్ చేశారు. ఈ చిత్రం గురించి మహేష్ బాబు మాట్లాడుతూ… రాజమౌళి తో ఒక్క సినిమా చేయడం 25 సినిమాలని ఒకేసారి చేయడం అని చెప్పారు. ఈ సినిమా కనుక తెరమీదకు వచ్చిందంటే ఫాన్స్ కి పండగే. ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ ని ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి రాస్తున్నారు.


End of Article

You may also like