మీడియా లో వైరల్ అవుతున్న పవన్, విష్ణు వీడియో పై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.!

మీడియా లో వైరల్ అవుతున్న పవన్, విష్ణు వీడియో పై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.!

by Sunku Sravan

నిన్న హైదరాబాద్ లో జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో భాగంగా పలువురు రాజకీయ నేతలతో తోపాటుగా పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. జనసేనాని పవన్ కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడి హోదాలో హీరో మంచు విష్ణులు కూడా వచ్చారు. స్టేజ్ పైన పక్కపక్కనే కూర్చున్న వీళ్లిద్దరు అస్సలు మాట్లాడొకోలేదు.. కనీసం చూసుకోను లేదు అంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.

Video Advertisement

pawan

 

ఇటీవలే జరిగిన మా అధ్యక్ష ఎన్నికలు రణరంగాన్ని తలపించే వాతావరణాన్ని చూసాము. ఈ పోటీలో నిలబడ్డ ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు మెగా ఫామిలీ లోని కొందరు ప్రకాష్ రాజ్ వైపు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాట్లాడుకోలేదు కనీసం పలకరించుకొను లేదంటూ మీడియా ఒక రేంజ్ లో చర్చలు మొదలు పెట్టారు.

pawan in alai balai

pawan in alai balai

ఈ సందర్బంగా మంచు లక్ష్మి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బండారు దత్తాత్రేయ గారు నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, మంచు విష్ణులు హాజరయ్యారని అయితే మీడియా లో చూపించిందంతా నిజం కాదని, కెమెరా వెనుక ఇరువురు చాల సేపు మాట్లాడుకున్నారని తెలిపారు. ఆలాగే మాలోమాకు ఎలాంటి విభేదాలకు తావులేదని అన్నారు. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలిపారు.

ఇవి కూడా చదవండి : ‘నువ్విక్కడ లేకున్నా భయం గా ఉంది’ అంటూ సమంత పోస్ట్ వైరల్ ఎవరిగురించి?


You may also like