“మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు..!” అంటూ… “మంచు విష్ణు” ట్వీట్‌కి నెటిజన్ల రిప్లై..! ఇంతకీ విష్ణు ఏమన్నారంటే..?

“మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు..!” అంటూ… “మంచు విష్ణు” ట్వీట్‌కి నెటిజన్ల రిప్లై..! ఇంతకీ విష్ణు ఏమన్నారంటే..?

by Megha Varna

Ads

మోహన్ బాబు సినిమా వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మంచు విష్ణు.  విష్ణు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనా విష్ణు ఎన్నో విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2021లో మా ఎలక్షన్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విష్ణు.

Video Advertisement

అటు పదవిని, ఇటు సినిమాల్లోనూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. 2009 మార్చి 1న తేదీన వెరోనిక ని వివాహం చేసుకున్నారు.

మంచు విష్ణు సినిమా బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన వారు అయితే, వెరోనిక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సంబంధించిన అమ్మాయి. ఇదిలా ఉంటే తాజాగా మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమాలో నటించాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు చేసారు. ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.

విష్ణు తాజాగా ఒక వ్యక్తి కోసం ట్వీట్ చేసాడు. అది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. దీనితో నెటిజన్లకి మరోసారి చిక్కాడు విష్ణు. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ తో కలిసి హోటల్‌లో డిన్నర్ చేయడం జరిగింది. కానీ వెన్నెల కిషోర్ సమయానికి రాలేదు. అదే విషయాన్ని పోస్ట్ చేసాడు విష్ణు. కానీ మంచు విష్ణు పైనే ట్రోల్స్‌ వస్తున్నాయి.

ట్విట్టర్ లో విష్ణు ఇలా పోస్ట్ చేసాడు ”8 గంటలకి ఒకరితో డిన్నర్ చెయ్యాలి.. కానీ టైం 8:20 అవుతోంది. కానీ ఆ గర్విష్టుడు రాలేదని” పోస్ట్ చేసాడు. సోషల్ మీడియా యూజర్లు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పోస్ట్ చేసారు. ”మోహన్ బాబు క్రమశిక్షణ పరంగా స్ట్రిక్ట్‌గా వుంటారు. విష్ణు కూడా అంతే” అని ఒకరున్నారు. ”మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు” అని మరొక యూజర్ కామెంట్ చేసారు. ఇలా ఫన్నీ గా రెస్పాన్స్ ఇచ్చారు సోషల్ మీడియా యూజర్లు.


End of Article

You may also like