Home Health Adda ఫేస్ మాస్క్ లు, శానిటైజర్ లు ఇప్పుడు అత్యవసర వస్తువులు కాదంట…ఎందుకో తెలుసా?

ఫేస్ మాస్క్ లు, శానిటైజర్ లు ఇప్పుడు అత్యవసర వస్తువులు కాదంట…ఎందుకో తెలుసా?

by Megha Varna

Ads

కరోనా ప్రపంచ దేశాల అన్నిటినీ అతలాకుతలం చేస్తుంది.భారత్ కూడా ఏమి ఇందుకు మినహాయింపు కాదు కాని భారత్ సామర్ధ్యాన్ని , శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి కరోనా చాలా ఉపయోగపడింది.కరోనా సందర్భంలో హైడ్రో క్లోరిక్వీన్ ను తమకు వెంటనే పంపకుంటే ఆంక్షలు పెడుతామని బెదిరించిన భారత్ తమకు కావాల్సిన టాబ్లెట్స్ ఉత్పత్తయ్యే వరకు వాటి ఎగుమతులకు అంగీకరించలేదు.

Video Advertisement

అన్నిటికంటే ముఖ్యంగా ఇటు దేశంలో డ్రాగన్ వైరస్ తో అటు బోర్డర్ లోనూ బసులు కొట్టే డ్రాగన్ సైనికులతో డీ అంటే డీ అంటున్నది.భారత్ పోరాట పటిమను చూసిన ప్రపంచ దేశాలు భారత్ కు సలాం చేస్తున్నారు.తాజాగా మరో మారు ప్రపంచ దేశాలు విస్తుపోయే విధంగా భారత్ ఒక ఘనతను సాధించింది.

అదేంటంటే ఫేసు మాస్క్ లు, శానిటైజర్స్ ను దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలో సమృద్దిగా ఉండేంత సప్లయ్ స్టాక్ ను ప్రొడ్యూస్ చేసింది.దానితో యూనియన్ కన్జ్యూమర్ యాక్ట్ నుండి ఈ రెండు ఐటమ్స్ ను తొలగిస్తున్నట్లు యూనియన్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టరి ప్రకటించింది.అన్ని రాష్ట్రాల ను సంప్రదించాకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అధికార ప్రతినిధి నతాన్ తెలిపారు.

సుమారు 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో కేవలం 3 నెలల వ్యవధిలో మాస్క్ లు , శానిటైజర్స్ అందరికీ సరిపడేంత సమృధ్ధిగా ప్రొడక్షన్ చేయడం ప్రస్తుతం ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేస్తుంది.


End of Article

You may also like