పెళ్లి అయిన 12 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం.. వ్యాపారం పేరు చెప్పి ఈ భర్త చేసిన పని చూడండి..!

పెళ్లి అయిన 12 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం.. వ్యాపారం పేరు చెప్పి ఈ భర్త చేసిన పని చూడండి..!

by Megha Varna

Ads

చాలామంది మహిళలు భర్త చేతిలో మోసపోతున్నారు. ఇటువంటి వార్తల్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి వార్త ఒకటి చోటు చేసుకుంది. వివాహం అయ్యి పన్నెండు ఏళ్ళు అయినా సరే ఇంత వరకు భర్త తనతో పాటు విదేశాలకి తీసుకు వెళ్ళ లేదు. ఎప్పుడూ రావడం, తిరిగి వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాడు. భార్య తీసుకెళ్ళమని అడిగితే కూడా తానూ ఎప్పుడు తీసుకు వెళ్ళలేదు. అసలు ఏమైంది..? ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే…

Video Advertisement

రాజస్థాన్ లోని జైపూర్ కి చెందిన దీపిక అనే మహిళని భగవాన్ దాస్ కి ఇచ్చి 2009లో వివాహం జరిపించారు పెద్దలు. వీరికి 2011 లో కుమారుడు జన్మించాడు. ఆ తరవాత బట్టల వ్యాపారం మొదలు పెడతానని 2014లో రష్యా వెళ్ళాడు భగవాన్ దాస్. అయితే ఒక్కడే రష్యా వెళ్ళాడు కానీ కుటుంబాన్ని మాత్రం తీసుకెళ్లలేదు. 2014లో రష్యా వెళ్లిన భగవాన్ 2016లో ఇండియాకి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత 2018 లో వచ్చి మళ్లీ అలానే చేశాడు. 2020లో వచ్చినప్పుడు ఇంక భార్య నన్ను కూడా తీసుకెళ్ళండి మీతో పాటు అని అడిగింది. అప్పుడు తాను రష్యాలో మరొక మహిళను వివాహం చేసుకున్నానని.. కొడుకు కూడా ఉన్నాడని చెప్పాడు భగవాన్. పైగా రష్యా లో మరొక మహిళని వివాహం చేసుకున్న ఫోటోలను కూడా చూపించాడు. ఆ తర్వాత అతనొక్కడే రష్యా వెళ్ళిపోయాడు.

ఇక భార్య కి ఏం చేయాలో అర్థం కాక భర్త కుటుంబ సభ్యుల్ని అడిగేసరికి వాళ్లకి ఏమీ తెలియదని చెప్పారు. పోలీసుల దగ్గరికి వెళ్లి తనకి జరిగిన మోసం గురించి చెప్పింది. అలానే అతని వీసా అక్టోబర్ తో ముగుస్తుందని.. రెన్యువల్ చేయకూడదని తెలిపింది. పోలీసులు భర్త భగవాన్ దాస్ మీద కేసు నమోదు చేశారు. విచారణ చేస్తున్నారు.


End of Article

You may also like