కన్నబిడ్డ ప్రాణాలను తీసేసిన తల్లి.. అసలేం జరిగిందంటే..?

కన్నబిడ్డ ప్రాణాలను తీసేసిన తల్లి.. అసలేం జరిగిందంటే..?

by Megha Varna

Ads

నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే బిడ్డ ప్రాణాలని తీసేసింది. తీవ్ర మనస్థాపానికి గురై ఆవేశంలో చిన్నారి ప్రాణాన్ని నుశిమేసింది కన్నతల్లి. అందుకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. పుట్టింటికి పంపలేదు అన్న కారణంతోనే ఆ తల్లి తన బిడ్డ ప్రాణాలని తీసేసినట్టు తెలుస్తోంది.

Video Advertisement

ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… బుక్కపట్నం మండల కేంద్రానికి చెందిన పద్మావతి 26 ని అమడగూరు మండలం గొల్లపల్లికి చెందిన వెంకటేష్ తో ఐదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఒక చిన్నారి కూడా జన్మించింది.

ఆమె పేరు నిహస్వి. ఈ చిన్నారికి కేవలం మూడు ఏళ్ళు. భర్త, భార్య ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే పద్మావతి తన భర్తను పుట్టింటికి పంపమని అడిగింది. కానీ భర్త అందుకు అంగీకరించ లేదు. పొద్దుతిరుగుడు పంట కోశాక వెళ్ళు అని వెంకటేష్ తన భార్య పద్మావతికి చెప్పాడు. ఆమెకి తన భర్త చెప్పింది నచ్చలేదు.

పైగా ఆమె మనస్తాపం చెందింది. దీంతో శుక్రవారం తన బిడ్డని ఇంటి నుండి తీసుకు వెళ్లిపోయింది. తన మూడేళ్ల బిడ్డను బావిలో పడేసింది. భార్య, బిడ్డ కనపడలేదని వెంకటేష్ వెతుకుతుండగా తుమ్మ చెట్ల బావి వైపు వెళ్లిందని తెలిసింది. బావి వద్దకు వెళ్లి చూస్తే.. చిన్నారి నిహస్వి మృతదేహం తేలియాడుతూ కనపడింది.

దీంతో స్థానికులు మృత దేహాన్ని బయటకు తీశారు. అయితే పద్మావతి మాత్రం కనబడలేదు. అదే బావిలోకి ఆమె దూకేసి ఉందా..? లేదంటే ఆమె ఎటైనా వెళ్లిందా..? అనేది తెలియాల్సి ఉంది. పద్మావతి బావిలో దూకి ఉండొచ్చని మోటార్ సహాయంతో నీటిని తోడిస్తున్నారు. రాత్రి పది అయినా సరే ఆచూకీ తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి గల్లంతైన పద్మావతిని వెతుకుతున్నారు.


End of Article

You may also like