సచిన్, కోహ్లీ కంటే రిచ్ ఇల్లు ఉన్న ఈ క్రికెటర్ ఎవరు.? 6 ఎకరాల్లో ప్యాలెస్‌.. 225 ఎకరాల ఎస్టేట్‌.!

సచిన్, కోహ్లీ కంటే రిచ్ ఇల్లు ఉన్న ఈ క్రికెటర్ ఎవరు.? 6 ఎకరాల్లో ప్యాలెస్‌.. 225 ఎకరాల ఎస్టేట్‌.!

by Harika

Ads

భారతదేశంలో ఎక్కువ మొత్తంలో అర్జిస్తున్న ఆటగాళ్ల జాబితాలో క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. అందులో ముఖ్యంగా టీమ్ ఇండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుంచి రోహిత్ శర్మ వరకు మన క్రికెటర్లు కోట్లల్లో సంపాదిస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులతో సంపన్న క్రికెటర్లుగా ప్రసిద్ధికెక్కారు. ఆటలో అద్భుతంగా రాణించి దాని ద్వారా వచ్చిన కీర్తిప్రతిష్టలతో తమ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ ఆర్థికంగా మరింత పరిపుష్టి చెందుతున్నారు. అటు క్రికెట్‌ ద్వారా ఇటు వివిధ ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక వీరు నివసించే ఇళ్ల విలువ కూడా వారి స్థాయికి తగ్గట్లే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Video Advertisement

సచిన్ టెండూల్కర్ ఇంటి విషయానికి వస్తే..ఆర్థిక రాజధాని ముంబైలోని బాద్రాలో దాదాపుగా 80 కోట్ల విలువ చేసే ఇంట్లో నివసిస్తున్నారు. ఇక టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్‌ ధోని స్వస్థలం రాంచిలో తన ఫామ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ విలాసవంతమైన భవనం విలువ రూ. 6 కోట్లు ఉంటుందని సమాచారం. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ముంబైలో విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు. 53 అంతస్తుల బిల్డింగ్‌లో 29వ ఫ్లోర్‌లో రోహిత్‌ ఉంటున్న నివాసం విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి గురుగ్రామ్ లో 80 కోట్ల విలువ చేసే బిల్డింగ్ లో ఉంటున్నాడు.

అయితే ఈ నలుగురు రిచెస్ట్‌ క్రికెటర్ల కంటే ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్‌ మరొకరు ఉన్నారు. ఆమె పేరు మృదుల జడేజా. ఈ పేరు చూసి “రవీంద్ర జడేజా” చుట్టం అనుకునేరు ..కానీ ఈమె కానే కాదు…ఈమె ఒక యువరాణి.గుజరాత్‌లోని రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రిపేరు మంధాతసిన్హ్‌ జడేజా. మృదులకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆమె చారిత్రాత్మక రంజిత్‌ విలాస్‌ ప్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు.

6 ఎకరాల్లో 150కి పైగా గదులతో ఆ ప్యాలెస్ రాజ్‌కోట్‌లో సుమారు 225 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎస్టేట్‌లో ఆరు ఎకరాల స్థలంలో ఈ భవనం ఉంది. మృదుల కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లో 150కి పైగా గదులు ఉన్నాయి. అంతేకాదు వారి గ్యారేజ్‌లో ఎన్నో విలాసవంతమైన వింటేజీ కార్లు కూడా ఉన్నాయి. మిగతా రాజకుటుంబాలు తమ నివాసాలను హెరిటేజ్‌ హోటళ్లుగా మలుస్తున్న తరుణంలో రంజిత్‌ విలాస్‌ ప్యాలెస్‌ను మాత్రం తమ పూర్వీకుల రాజసానికి గుర్తుగా అలాగే ప్రైవేట్‌ ప్రాపర్టీగా ఉంచేశారు.

ఇక తమ రాజభవానికి సంబంధించిన ఫొటోలను మృదుల జడేజా అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటారు.. మృదుల జడేజా ఆల్‌రౌండర్‌. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర మహిళా జట్టుకు ఆమె సారథ్యం వహించారు. తన కెరీర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్లో 46(వన్డే), టీ20 ఫార్మాట్లో 36, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఒక మ్యాచ్‌ ఆడారు. కుడిచేతి వాటం గల బ్యాటర్‌ అయిన 32 ఏళ్ల మృదుల రైటార్మ్‌ మీడియం పేసర్‌ కూడా. అయితే గతంలో పురుష, మహిళా క్రికెటర్ల వేతనాలకు మధ్య వ్యత్యాసాలపై గళమెత్తిన వాళ్లలో మృదుల కూడా ఒకరు. కాగా మృదుల జడేజా కేవలం క్రికెటర్‌ మాత్రమే కాదు. గోల్ఫ్‌ పట్ల కూడా ఆమెకు మంచి అవగాహన ఉంది.


End of Article

You may also like