TS ELECTIONS: తండ్రి చేసిన త్యాగం…కొడుకు గెలిచాడు…కానీ తండ్రి ఓడిపోయారు.! అసలేమైంది.?

TS ELECTIONS: తండ్రి చేసిన త్యాగం…కొడుకు గెలిచాడు…కానీ తండ్రి ఓడిపోయారు.! అసలేమైంది.?

by Harika

Ads

తెలంగాణ ఎన్నికల్లో కొన్నిచోట్ల తప్ప మిగిలిన చాలా వరకు నియోజకవర్గాలలో కాంగ్రెస్ హవా బాగా కనిపించింది. ఎన్నికలకు ముందు జరిపిన సర్వే కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. కానీ అప్పట్లో ఎవరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు .ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు .అందుకే ఎన్నికల తర్వాత రిజల్ట్స్ రూపంలో పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నాడు.

Video Advertisement

కాంగ్రెస్ హవా ఎంత ఉన్నా కచ్చితంగా గెలుస్తారు అని భావించిన కొందరు అభ్యర్థుల ఫలితాలు తారుమారు అవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉంటున్న వాళ్లు కూడా ఈసారి ఓటమి చవిచూశారు.
మైనంపల్లి హన్మంతరావు..  2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలిచి పింక్ జెండాను ఎగరవేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు టికెట్లు ప్రకటించిన కేసీఆర్ ఈసారి మైనంపల్లి కి కూడా టికెట్ ఇచ్చారు.

అయితే ఈసారి కొడుకుని ప్రోత్సహించాలి అని భావించి మైనంపల్లి.. కేసీఆర్ ను తన కొడుకుకి మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు.అయితే అతని కోరిక నిరాకరించడంతో.. మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు కురిపించి కొడుకుతో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు మైనంపల్లి హనుమంత్ రావు.

మల్కాజ్గిరి నుండి బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు సడన్ గా ఆ పార్టీ నుండి తప్పుకొని కాంగ్రెస్ కి వెళ్లిపోవడంతో… చివరి క్షణంలో మల్కాజ్గిరి టికెట్ ని మంత్రి మల్లారెడ్డి అల్లుడు అయిన రాజశేఖర్ రెడ్డికి ఆ టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. అనూహ్యంగా రాజశేఖర్ రెడ్డి (బీఆర్‌ఎస్‌) అక్కడ విజయం సాధించారు. దీంతో మైనంపల్లి హన్మంతరావు ఓడిపోయారు.  అతని కొడుకు మెదక్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. కొడుకైతే గెలిచాడు కానీ ఇంత పట్టు పట్టిన తండ్రి మాత్రం ఓడిపోవడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 


End of Article

You may also like