సోషల్ మీడియా గురించి రానా అడిగేసరికి “నాగ చైతన్య” ఏమన్నారో తెలుసా.? అందులో నిజం లేదు కదా అంటూ “సాయి పల్లవి” ఆన్సర్.!

సోషల్ మీడియా గురించి రానా అడిగేసరికి “నాగ చైతన్య” ఏమన్నారో తెలుసా.? అందులో నిజం లేదు కదా అంటూ “సాయి పల్లవి” ఆన్సర్.!

by Megha Varna

Ads

ప్రస్తుతం నాగ చైతన్య, సమంత విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. నాగ చైతన్య కూడా లవ్ స్టోరీ ప్రమోషన్ సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అడగొద్దు అని చెప్పారు. సమంత కూడా ఎక్కడైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే అసలు స్పందించడంలేదు. ఈ నేపథ్యంలో, గతంలో  నంబర్ 1 యారి ప్రోగ్రాంలో నాగ చైతన్య మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

naga chaitanya about social media in no 1 yaari

ఈ షోకి నాగ చైతన్యతో పాటు, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా హాజరయ్యారు. ఈ షో వచ్చి కొన్ని నెలలు అయింది. కానీ ప్రస్తుతం నడుస్తున్న విషయాల కారణంగా మళ్ళీ వైరల్ అవుతోంది. షోలో భాగంగా రానా, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో రానా, నాగ చైతన్యని, “సోషల్ మీడియా గురించి నీకు నచ్చని విషయం ఏంటి?” అని అడిగారు. అందుకు నాగ చైతన్య “మొత్తం” అని చెప్పారు.

naga chaitanya about social media in no 1 yaari

అప్పుడు సాయి పల్లవి, “అందులో నిజం ఉండదు కదా?” అని అర్థం వచ్చేలా అన్నారు. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్యల గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అందులో నిజం ఎంతో తెలియాలి అంటే…స్వయంగా వారే స్పష్టత ఇచ్చే అంత వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఇలాంటి గాసిప్ లు ఎన్నో వస్తూనే ఉంటాయి అనుకుంటా.

watch the full episode on AHA : >>>CLICK HERE<<<


End of Article

You may also like