గతంలో నంబర్ 1 యారి ప్రోగ్రాంలో నాగ చైతన్య మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ షోకి నాగ చైతన్యతో పాటు, హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా హాజరయ్యారు. ఈ షో వచ్చి కొన్ని నెలలు అయింది. కానీ ప్రస్తుతం నడుస్తున్న విషయాల కారణంగా మళ్ళీ వైరల్ అవుతోంది. షోలో భాగంగా రానా, నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో రానా, నాగ చైతన్యని, “సోషల్ మీడియా గురించి నీకు నచ్చని విషయం ఏంటి?” అని అడిగారు. అందుకు నాగ చైతన్య “మొత్తం” అని చెప్పారు. అప్పుడు సాయి పల్లవి, “అందులో నిజం ఉండదు కదా?” అని అర్థం వచ్చేలా అన్నారు.

watch the full episode on AHA : >>>CLICK HERE<<<
