సమంత నాగ చైతన్య మళ్ళి కలవనున్నారా? హామీ ఇస్తున్న నాగార్జున.

సమంత నాగ చైతన్య మళ్ళి కలవనున్నారా? హామీ ఇస్తున్న నాగార్జున.

by Sunku Sravan

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న చూడ ముచ్చటైన జంటల్లో ఒకరు సమంత నాగ చైతన్య. కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంటను ముద్దుగా చెయ్ సామ్ అని పిలిచేవారు. కొంతకాలపు దాంపత్య జీవితం తర్వాత “మేము విడిపోతున్నాము” అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అటు ఇండస్ట్రీ కి, ఇటు అభిమానులకు షాక్ ఇచ్చారు. అసలు వారి విడాకులకు కారణం మయ్యుంటుందో ఇప్పటివరకు కారణాలు తెలిసిరాలేదు. అయితే పెళ్లి తర్వాత సమంత సినిమాలకు దూరంగా ఉండాలని అక్కినేని కుటుంభం షరతు పెట్టిందన్న ఒక కారణం సోషల్ మీడియాలో షికారు చేసింది. అందులో వాస్తవమెంతుందో ఇప్పటికీ తెలియదు.

Video Advertisement

అక్కినేని కుటుంభమంతా కలిసి మనం అనే సినిమాలో నటిస్తే చూడటానికి బాగుందంటూ కితాబు కూడా వచ్చింది. ఆడపిల్లలు లేని నాగార్జున కోరికకు సమన్తా అటు కోడలుగా, బిడ్డగా, తల్లిగా వచ్చిందంటూ మెచ్చుకున్నారు. కానీ ఈ జంట అనవసరంగా విడిపోయారు మల్లి కలిస్తే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. అయితే తాజాగా దానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో చూద్దాం.

Nagarjuna with Chay Sam

Nagarjuna with Chay Sam

చెయ్ సామ్ మళ్ళి కలవబోతున్నారు. వాళ్ళను కలిపే బాధ్యతను నాగార్జున భుజాన వేసుకున్నాడని సమాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స‌మంత తల్లిదండ్రుల‌ను కలిసి మాట్లాడితే వారు సుముఖంగానే ఉన్నార‌ని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం సోషల్ మీడియాలోనే ప్రచారంలో ఉంది. కావునా నాగచైతన్య సమంత కలుస్తారన్న దాంట్లో ఎటువంటి నిజం లేకపోవచ్చు. అయితే స‌మంత‌, చైతూ క‌ల‌వ‌డం అన్న‌ది దాదాపుగా అసాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇప్పటివరకు విడిపోయిన ఏ సెలెబ్రెటీ జంట మల్లి కలిసినట్లు లేదు. విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు.

ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సినిమా మీద సినిమా లను లైన్ లో పెట్టింది. వాటిల్లో గ్లామర్ డోస్ కూడా పెంచింది. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్క్షన్ లో శాకుంతలం అనే సినిమా తెరక్కెక్కుతుంది. దాంతో పాటు యశోద అనే సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది.

 


You may also like

Leave a Comment