Ads
తాజాగా కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. తన అభిమానులకి దీపావళి శుభాకాంక్షలని ఆమె తెలుపుతూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని.. ఈ దీపావళికి విజయాల్ని అందుకోవాలని ఆమె రాసింది. అయితే దీనితో పాటుగా ఆమె ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.
Video Advertisement
కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో లిక్కర్ బ్రాండ్ టీచర్స్ 50 స్కాచ్ విస్కీని ప్రమోట్ చేస్తూ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఉన్న ఫోటోని ఆమె పెట్టింది. అదే విధంగా ఆమె ఈ పండుగని మీరు మీకు నచ్చిన వాళ్ళతో పాటు టీచర్స్ ఫిఫ్టీ స్మూత్ లిక్విడ్ గోల్డ్ తో జరుపుకోండి అని ఆమె చెప్పింది.
ఆమె తన అభిమానుల్ని జాగ్రత్తగా తాగమని సూచించింది. ఈ కంటెంట్ కేవలం 25 ఏళ్లు దాటిన వాళ్ల కోసం మాత్రమే అని చెప్పింది. దీన్ని చూసిన అభిమానులు వివిధ రకాల ఫన్నీ రియాక్షన్స్ ని ఇస్తున్నారు. కొందరైతే ఆల్కహాల్ ని ఆమె ప్రమోట్ చేస్తోంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CVsPa-QsThL/?utm_source=ig_web_copy_link
End of Article