చావు కళ స్పష్టంగా కనపడుతోందంటూ సబ్యసాచి యాడ్ పై నెటిజెన్స్ ట్రోల్స్..!

చావు కళ స్పష్టంగా కనపడుతోందంటూ సబ్యసాచి యాడ్ పై నెటిజెన్స్ ట్రోల్స్..!

by Megha Varna

ఫ్యాషన్ రంగంలో సబ్యసాచి డిజైన్లకి ఎంత స్పెషల్ వుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరో హీరోయిన్స్ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి సబ్యసాచి డిజైన్లని చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలం లో సబ్యసాచి కలెక్షన్ల పై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి.

Video Advertisement

మొన్నటికి మొన్న వచ్చిన మంగళసూత్ర యాడ్ కూడా రకరకాల ట్రోల్స్ కి గురయింది. తాజాగా సబ్యసాచి డిజైన్ హెడ్ సబ్యసాచి ముఖర్జీ చేయించిన యాడ్ చూసి నేటిజన్లు మండి పడుతున్నారు. తాజాగా వింటర్ కలెక్షన్ 2021 పేరిట కొత్త కలెక్షన్ ని విడుదల చేయడం జరిగింది.

దానిలో భాగంగా మోడల్స్ తో ఫోటో షూట్ చేశారు. అయితే జూలరీ అంతా చాలా బాగుంది కానీ వాటిని ధరించిన మోడల్స్ మొహం లో ఎలాంటి నవ్వు లేదు. ఎవరో చచ్చిపోయినట్లు ఆ మొహం ఏమిటి అంటూ నేటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మోడల్స్ ముఖంలో చావు కళ స్పష్టంగా కనపడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


You may also like