Big Boss: “వీళ్ళేమి ఫ్రెండ్స్..” అంటూ షన్ను, సిరి లపై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే..?

Big Boss: “వీళ్ళేమి ఫ్రెండ్స్..” అంటూ షన్ను, సిరి లపై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం ఏంటంటే..?

by Megha Varna

Ads

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. సమయాన్ని బట్టి రంగులు మార్చడం సహజమే. అయితే బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్, జెస్సి ముగ్గురు మంచి స్నేహితులు. వీళ్ళ ముగ్గురు స్నేహం చాలా బాగుంటుంది. ఎప్పుడూ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, సీక్రెట్స్ ని షేర్ చేసుకోవడం, టాస్కులు జరిగేటప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం.

Video Advertisement

57వ రోజు జెస్సి కొంత అస్వస్థతకు గురయ్యాడు. అయితే జెస్సీ పరిస్థితి బాగోక పోయినప్పటికీ సిరి, షణ్ముఖ్ తనని పట్టించుకోలేదు. మొదట్లో వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు గ్యాప్ పెరిగినట్లు మనం చూడొచ్చు. అయితే జెస్సీ కి ఆరోగ్యం బాగోక పోవడం… సిరి, షణ్ముఖ్ తనని చూసుకోక పోవడం వలన బయట జనాలకు కూడా తెలిసిపోయింది.

షణ్ముఖ్ జెస్సి విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు అర్థమవుతోంది. జెస్సి పరిస్థితి బాగోలేక పోయినప్పటికీ షణ్ముఖ్, సిరి కామెడీ చేయడం మరొక పాయింట్. అయితే ఈ పరిస్థితిని చూసి వీళ్ళు స్నేహితులా అంటూ సన్నీ అసహనం వ్యక్తం చేశాడు. అయితే రానున్న రోజుల్లో వీళ్ళ బాండింగ్ ఇంకెంతలా మారిపోతుందో చూడాలి.


End of Article

You may also like