Ads
పెళ్లి ఇష్టం లేని ఓ అమ్మాయి దారుణానికి ఒడిగట్టింది. నిశ్చితార్ధం పూర్తి అయ్యాక.. కాబోయే భర్తని తమ ఊరు రావాలంటూ పిలిచింది. తల్లి తండ్రులకు తెలియకుండా అతని గొంతు కోసి దారుణానికి ఒడిగట్టింది. పెళ్లి ఇష్టం లేదని తల్లి తండ్రులకి చెప్తే అయిపోయేదానికి.. కాబోయే వ్యక్తి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది.
Video Advertisement
ఈ సంఘటనలో ఒక కొత్త విషయం బయటికి వచ్చింది. సాక్షి కథనం ప్రకారం నిందితురాలైన పుష్ప రామానాయుడుపై దాడి చేసినట్లు ఒప్పుకుంది. పుష్పకి ఈ పెళ్లి ఇష్టం లేదు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. చాలాకాలంగా పుష్ప భక్తి మైకంలో ఉంది. దాంతో దేవుడి భక్తురాలు గానే ఉండిపోతాను పెళ్లి చేసుకోను అని చెప్పింది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లిచూపులు రద్దు అవడంతో మూడవసారి పుష్పని పెళ్ళికి ఒప్పించారు. దాంతో పుష్ప తనకి కాబోయే భర్తని బయటకు తీసుకెళ్లి చంపేయాలి అని ప్లాన్ వేసింది.
దాంతో గుడి దగ్గర రామానాయుడు కళ్ళకి చున్ని కట్టి సర్ప్రైజ్ అని గొంతు కోసింది. దాడి తర్వాత రక్తంతో రామానాయుడు షర్టు అంతా తడిసిపోయింది. దాంతో పుష్ప ఆందోళనకి గురి అయ్యింది. పుష్ప చున్నిని రామానాయుడు గొంతుకి కట్టుకొని ఆమెని బైక్ ఎక్కించుకొని రావికమతం ఆస్పత్రికి వెళ్ళాడు. మధ్య మార్గంలో పరిస్థితి విషమించడంతో బైక్ ఆపి పడిపోయాడు. అక్కడ ఉన్న ఒక యువకుడు రామానాయుడు పరిస్థితిని చూసి రావికమతం ఆసుపత్రిలో ఇద్దరిని వదిలి వెళ్లిపోయాడు.
End of Article