వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్

వైభవంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్

by Sainath Gopi

Ads

– ‘పారావీల్’ వెబ్ సైట్, యాప్ – భారతదేశపు మొట్టమొదటి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటిలిజెన్స్ వెబ్ సైట్, యాప్
– ‘పారావీల్’ యాప్ లో ఏపీలోని 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారం
– గ్రామ, బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ సమస్యలను తెలుసుకునే అవకాశం
– రాజకీయాల్లో ఉన్నవారికి, రావాలనుకునే వారికి ఉపయోగకరం
– ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 19 మందిపై 30శాతం ప్రజా వ్యతిరేకత
– త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ పారావీల్ వెబ్ సైట్, యాప్ ప్రారంభం

Video Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుస్తుందని ఆక్యురేట్ గా పర్పెక్ట్ సర్వే ఇచ్చిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ పారావీల్ అనే యాప్ ను తయారుచేసింది. భారతదేశపు తొలి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ యాప్ గా పారావీల్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రజల ముందుకు తీసుకొస్తోంది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ. పారావీల్ యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్ హైదరాబాద్ వెస్టిన్ హోటల్లో ఘనంగా జరిగింది. యాంకర్ సుమతో కలిసి ఈ యాప్ ను కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి లాంఛ్ చేశారు.

ఈ సందర్భంగా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి మాట్లాడుతూ – జూన్ 4వ తేదీ మా సంస్థకు ప్రత్యేకమైన రోజు. గతేడాది ఇదే రోజున ఏపీ ప్రజలు మా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ గురించి మాట్లాడుకున్నారు. కూటమి గెలుస్తుందని మేము ఇచ్చిన సర్వే ఆక్యూరేట్ గా నిజమైంది. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాం. అంతేగానీ మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు మా సంస్థ నుంచి పారావీల్ వెబ్ సైట్, యాప్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది భారతదేశపు ఫస్ట్ రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్. ఏపీలో మొదట ప్రారంభిస్తున్నాం. ఈ నెల 12 నుంచి మా వెబ్ సైట్, యాప్ అందుబాటులోకి వస్తుంది. క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మా ప్లాట్ ఫామ్స్ ప్రారంభిస్తాం. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి అనేది తెలుసుకునేందుకు మా పారావీల్ వెబ్ సైట్, యాప్ ఉపయోగపడుతుంది. ఒక్కో నియోజకవర్గంపై 36 అంశాలతో 100 పేజీలకు తగ్గకుండా సమగ్ర సమాచారాన్ని పొందుపరిచాం. ఇందులో విద్యా, వైద్యం, మేల్, ఫీమేల్, కులాల మధ్య సమస్యలు…లాంటి అన్ని అంశాలుంటాయి. ఒక్కో నియోజకవర్గంలో ఉండే జనాభాతో పాటు, మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి లో ప్రతి అంశాన్ని ప్రస్తావించడంతోపాటు అక్కడ ఉన్న సమస్యలను సైతం అప్లికేషన్ లో తెలుసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారికి ఏం సమస్యలు ఉన్నాయి అనే సమాచారం కూడా ఉంటుంది.

ప్రస్తుతం మేము తీసుకున్న డాటా ప్రకారం 19 ఎమ్మెల్యేలపై 30 శాతం వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేత ఎవరు కావాలని కూటమి సపోర్టర్స్ ను అడిగితే ఆశ్చర్యపరిచేలా 7శాతం మంది ఎన్టీఆర్ పేరు చెప్పారు. అలాగే కూటమి నేత ఎవరు కావాలని వైసీపీ సపోర్టర్స్ ను అడిగితే ఎన్టీఆర్ కావాలంటూ 21శాతం మంది చెప్పారు. ఏపీ ప్రారంభమయ్యే మా వెబ్ సైట్, యాప్..త్వరలో ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తాం. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధానమంత్రి వరకు ఎవరికైనా డాటా ముఖ్యం. తమ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో డాటాతో సహా తెలుసుకుంటేనే అక్కడ ఆ సమస్యలు పరిష్కరించి విజయం సాధించవచ్చు. పారావీల్ ద్వారా ఆ సమస్యలను తెలియజేస్తాం. మీరు గెలవాలనుకుంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. కొత్తగా ఎమ్మెల్యే కావాలనుకునేవారు కూడా నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలి. అన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రవీణ్, సాయి, తిరుమలేష్, గంగాధర్, యోగేశ్వర్ రెడ్డి, సాంబశివ, సుశాంత్ పాల్గొన్నారు.


End of Article

You may also like