Ads
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకి ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆయన అభిమానులు వారం ముందు నుంచే హడావిడి చేస్తూ ఉంటారు. టిక్కెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడడం, బెనిఫిట్ షోలు చూడడం కోసం నిద్ర మానుకోవడం వారికి అలవాటే.డిసెంబర్ 22 తారీకున యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల కానుంది. దీనికి సంబంధించిన నైజాం ఏరియాలో మంగళవారం నుండి టికెట్లు బుకింగ్ ప్రారంభించారు. ఈ టిక్కెట్లు కొనుక్కోవడానికి థియేటర్ ముందు అభిమానులు బార్లు తీరారు. రెండు గంటల ముందు నుంచి లైన్ లో నిలబడి టిక్కెట్లు కోసం కొట్టుకున్నారు.
Video Advertisement
ఇదంతా చూసిన జనం సినిమా అంటే ఎంత పిచ్చి ఉన్నవారు బాధ్యతగా ఓటు వేయడానికి మాత్రం రారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మూడు గంటల సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఐదేళ్లు తమని పాలించే నాయకుడు ఎన్నుకోవడానికి తీరిక ఉండదా అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో యువత ఓటింగ్ చాలా తక్కువ శాతం పోలైంది. సినిమా టికెట్లు కోసమే కాదు…ఒక పౌరుడిగా తమ బాధ్యత నిర్వర్తించడంలోనూ ఇదే శ్రద్ధ చూపించాలని కోరుతున్నారు.
End of Article