Home News ఈ ఫోటోలో ఉన్న పెద్ద నాయకులు ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో ఉన్న పెద్ద నాయకులు ఎవరో గుర్తు పట్టారా..?

by Sainath Gopi

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరనుంచి చెంబు,చాట దగ్గరనుంచి విఠలాచార్య సినిమాల వరకు అన్ని చూడవచ్చు, చూపించవచ్చు. ఇప్పుడు యువత వారి సమయాన్ని ఇందుకోసమే చాలా వరకు వినియోగిస్తున్నారు.అయితే ఇలా చేయటం వలన కొంత మంచి జరిగితే మరి కొంత చెడు జరుగుతుంది అని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని మనము కళ్ళతో చూడలేని చాలా విషయాలను చాలా దగ్గరగా చూడగలుగుతున్నాము.

these people became great leaders

ఈ క్రమంలోనే అటు సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్ల ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని పోల్చుకోండి అంటూ ఛాలెంజ్ లు కూడా విసురుతున్నారు చాలామంది. ఈమధ్య అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్న పిల్లలు తమ నవ్వులని విరబూస్తూ చాలా ముద్దుగా ఉన్నారు.

 

వీళ్ళు ఎవరా అని ఆరా తీసిన వాళ్ళకి నిజం తెలిసి ఆశ్చర్యపోయారు. అవునండి నేను చెప్పేది నిజం.ఫోటోలో ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. వీరిద్దరి చిన్నప్పటి ఫోటో ఇది. కానీ నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే ఇప్పటి ఈ అన్నాచెల్లెళ్లకి అప్పటి అన్నా చెల్లెలకి అస్సలు పోలికే లేదు. 2012లో ఆస్తుల కేసుల్లో జగన్ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు.

 

అప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షులుగా విజయమ్మ పార్టీని ముందుకు నడిపిస్తే జగన్ కి మద్దతుగా షర్మిల పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపించడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ని ఓడించడానికి టిడిపి జనసేన బిజెపి లు కలిసి పోటీ చేస్తున్నాయి. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి.

You may also like