Ads
వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది పూజా హెగ్డే. తెలుగుతో పాటు అటు తమిళ మరియు హిందీ సినిమాల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది పూజ. దీంతో ఈ భామ క్రేజ్ బాగానే పెరిగినట్లే.ఈ క్రేజ్ తో పూజా హెగ్డే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.
Video Advertisement
రాధే శ్యామ్, ఆచార్య తో ఫ్లాపులు అందుకున్న పూజా హెగ్డే పాన్ ఇండియా సినిమాలు అవకాశాల కోసం తెగ ఆరాటపడిపోతుంది అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హిందీలోని కొత్త సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తుంది కూడా. టాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్లకు నో చెప్పడానికి కూడా వెనకాడటం లేదు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి కండిషన్స్ అప్లై చేసేస్తుంది పూజ.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం రాబోతుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రం కోసం పూజా హెగ్డే హీరోయిన్ గా నటింపజేయడానికి సంప్రదిస్తే కొన్ని కండిషన్ పెట్టినట్లు సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
#1 మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించడానికి కేవలం 45 రోజులు మాత్రమే డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు మించి ఒక్క రోజు ఎక్కువ ఇచ్చేది లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేసిందట.
#2 అంతే కాకుండా తన పాత్రకు గాను రెండు కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం చేసిందట.
#3 తన స్టాఫ్ కూడా శాలరీ ఇవ్వాలంటూ కండిషన్స్ అప్లై చేసిందట.
వరస ఫ్లాపులు అందుకుంటూ ఇలాంటి కండిషన్స్ పెట్టడం అవసరమా అంటూ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే ఇటీవల హీరోయిన్ గా నటించిన బీస్ట్ కూడా ఆశించిన ఫలితం పొందలేదు. ఇది ఇలా ఉండగా హిందీలో సల్మాన్ ఖాన్ తో జోడిగా ఒక చిత్రం నటిస్తుంది పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కండిషన్స్ అప్లై చేస్తే అమ్మడితో కష్టమే అంటున్నారు సినీ వర్గాలు.
End of Article