తాళి కట్టే సమయానికి పవర్ కట్..! తర్వాత జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తాళి కట్టే సమయానికి పవర్ కట్..! తర్వాత జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mohana Priya

Ads

అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు అకస్మాత్తుగా జరిగిపోతుంటాయి. వీటిని చూసి మనం నవ్వుకోవాలో, లేదంటే బాధపడాలో అసలు అర్థం కావు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి విషయాలు చాలా తొందరగా వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

అలాంటి ఒక సంఘటన ఈ పెళ్లి పందిట్లో జరిగింది.. మరి అక్కడ ఏం జరిగింది.. ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం..!!
పెళ్లి మండపాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు.. బంధుమిత్రులు అంతా వచ్చి కూర్చున్నారు. ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది. పంతులుగారు తాళి కట్టండి అని మంత్రాలు చెబుతున్నారు.

power cut

ఇంతలో పవర్ కట్ అయింది. ఇంకేముంది అంతా చీకటి అయిపోయింది.. ముహూర్త సమయంలో తాళి కట్టాలని అలాగే ఆ తంతు కానిచ్చేశారు. కానీ ఒకరి కట్టాల్సిన తాళి మరొకరి మెడలో పడింది.. అది ఏంటో చూడండి..? భోపాల్ కు చెందిన రమేష్ లాలూకు ఇద్దరు కుమార్తెలు.. నిఖితా, కరిష్మా వీరికి ఆదివారం రాత్రి బోలా, గణేష్ లతో వివాహం కుదిర్చారు. ఇద్దరికీ పెళ్లి ఓకే ముహూర్తంలో రావడంతో ఒకే సారి ఇద్దరు పెళ్లి చేయడానికి పెళ్లి మండపంలో కూర్చోబెట్టారు.

power cut

ఇద్దరు అక్క, చెల్లెల్లకి ఒకే రకమైన దుస్తులు వేశారు. రాత్రి సమయం కావడంతో మండపంలో తాళి కట్టే సమయానికి పవర్ కట్ అయింది. దీంతో పొరబడిన పెళ్లి కొడుకులు చెల్లికి కాబోయే భర్త అక్కకు, అక్కకు కాబోయే భర్త చెల్లికి తాళి కట్టేశారు. అయితే పురోహితుడు సైతం ఈ విషయాన్ని గమనించకుండా వివాహ తంతు ముగించాడు. అయితే పెళ్లి కుమారులు వారి ఇంటికి వధువులను తీసుకెళ్లిన తర్వాత పొరపాటు జరిగిపోయిందని గుర్తించారు. దీంతో విషయం పెద్దల వరకు వెళ్లడంతో మరుసటి రోజు పెళ్లి మళ్లీ చేయాలని నిర్ణయించారు.


End of Article

You may also like