Home News అదృష్టం అంటే ఇతనిదే అనుకుంటా….”విజయవాడ”లో పైనుంచి రైలు దూసుకెళ్లినా ఎలా బ్రతికిపోయాడో చూడండి.!

అదృష్టం అంటే ఇతనిదే అనుకుంటా….”విజయవాడ”లో పైనుంచి రైలు దూసుకెళ్లినా ఎలా బ్రతికిపోయాడో చూడండి.!

by Mohana Priya

విజయవాడలో జరిగిన ఒక సంఘటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ట్రైన్ ఎవరి మీద నుండి అయినా వెళ్తే వారు బతకడం అనేది కూడా అసాధ్యమైన విషయం. అలాంటిది ఒక వ్యక్తి మీద నుండి ట్రైన్ వెళ్లినా కూడా అతని మీద ఒక చిన్న గాయం లేకుండా బయటపడ్డాడు.

అందుకే ఇది విన్న వాళ్లు అందరూ కూడా ఆ వ్యక్తిని మృత్యుంజయుడు అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే, విజయవాడ రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి కదులుతున్నట్రైన్  ఎక్కుతూ అదుపు తప్పి కింద పడిపోయారు. శనివారం, అంటే డిసెంబర్ 30వ తేదీన, సాయంత్రం 7 గంటల 45 నిమిషాల ప్రాంతంలో విజయవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

pratap vijayawada railway station incident

విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1 మీద, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు అప్పుడే బయలుదేరింది. ఇది చూసిన ప్రతాప్ అనే వ్యక్తి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ సంఘటన చూస్తూ ఉన్న ప్రయాణికులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఎంతో ఆందోళన చెందారు. కానీ ప్రతాప్ పడిపోయిన చోట గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది.

pratap vijayawada railway station incident

దాంతో కింద పడిపోయిన వెంటనే ప్రతాప్ పడుకొని ఉన్నారు. అందుకే ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రతాప్ ని చూస్తూ ఉంటే ఆయన వయసు 55 నుండి 60 ఏళ్ల వరకు ఉండొచ్చు అని తెలుస్తోంది. దాంతో ప్రతాప్ ని చూసిన వాళ్లు అందరూ కూడా, “ఈ వయసులో ఇలాంటి సాహసాలు చేయడం అవసరమా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

pratap vijayawada railway station incident

కానీ ఏదేమైనా సరే అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా సమయస్ఫూర్తితో ఆలోచించిన ప్రతాప్ ని మెచ్చుకోవాల్సిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది. దాంతో ఈ సంఘటనని రైల్వే స్టేషన్ లో ఉన్నవారు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా దాదాపు ప్రపంచం అంతా కూడా చూసింది. దాంతో ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా భిన్న రకాలుగా తమ కామెంట్స్ తెలుపడం మొదలు పెట్టారు.

watch video :

ALSO READ : YS SHARMILA – YS VIJAYAMMA: కాంగ్రెస్ లో చేరనున్న షర్మిల…. విజయమ్మ దారి ఎటు…?

You may also like