కరోనా కారణంగా గత సంవత్సరం కాలంగా థియేటర్స్ సరిగ్గా నడుపుకోలేని పరిస్థితి. నారప్ప సినిమా థియేటర్స్ లో కాకుండా ott లో విడుదల చేస్తున్నారు సురేష్ బాబు. అయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు.ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమాల మీద తీసుకున్న నిర్ణయాలు, సినీ నిర్మాతలను కలవర పెడుతుంది.

suresh-babu-comments-on-ap-govt
టికెట్ రేట్ ధర విషయం లో తీసుకున్న కఠిన నిర్ణయాలు ప్రొడ్యూసర్స్ కి తలనొప్పిగా మారాయి ఇప్పుడున్న పరిస్థితిల్లో తెలంగాణాతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల పరిస్థితి దారుణం. టికెట్ ధరల్లో చిన్న సవరణలు అడిగినా ఏపీ ప్రభుత్వం చేయడం లేదు. సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ యాజమాన్యాలు సినిమా మీద ప్రేమతో నడపడమే తప్ప పైసా లాభం ఉండదు. రూ. 40 టిక్కెట్తో ఏసీ థియేటర్లు నడపమంటే హౌస్ఫుల్ అయినా కూడా కరెంట్ బిల్లు రాదు. ప్రభుత్వాన్ని అడిగితే మీరు థియేటర్లు తెరవండి తర్వాత మారుస్తాం అంటున్నారట. అక్కడి థియేటర్ యాజమాన్యాలకు ఇది జీవన్మరణ సమస్యే : సురేష్ బాబు
